“హిందూ ఫల్ దుకాణ్” అని రాసినందుకు కేసు.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న మాజీ సీఎం

కరోనా కాలంలో పండ్ల దుకాణాదారుడిపై జార్ఖండ్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే ఆయన అమ్మే పండ్లపై ఉమ్మడం కానీ.. ఇంకేమైన చర్యలకు పాల్పడలేదు. ఆయన చేసిన తప్పేంటంటే ఆయన పండ్ల బండిపై హిందూ ఫల్ దుకాణ్ అని బ్యానర్‌ పెట్టాడు. ఆ బ్యానర్‌పై విశ్వ హిందూ పరిషత్ ఆమోందిచబడినది అన్నట్లుగా రాసి ఉంది. అయితే ఇది స్థానికంగా మత విద్వేశాలను రెచ్చగొట్టేలా ఉందంటూ పోలీసులు పండ్ల దుకాణం యజమానిపై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ […]

హిందూ ఫల్ దుకాణ్ అని రాసినందుకు కేసు.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న మాజీ సీఎం
Follow us

| Edited By:

Updated on: Apr 26, 2020 | 9:42 PM

కరోనా కాలంలో పండ్ల దుకాణాదారుడిపై జార్ఖండ్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే ఆయన అమ్మే పండ్లపై ఉమ్మడం కానీ.. ఇంకేమైన చర్యలకు పాల్పడలేదు. ఆయన చేసిన తప్పేంటంటే ఆయన పండ్ల బండిపై హిందూ ఫల్ దుకాణ్ అని బ్యానర్‌ పెట్టాడు. ఆ బ్యానర్‌పై విశ్వ హిందూ పరిషత్ ఆమోందిచబడినది అన్నట్లుగా రాసి ఉంది. అయితే ఇది స్థానికంగా మత విద్వేశాలను రెచ్చగొట్టేలా ఉందంటూ పోలీసులు పండ్ల దుకాణం యజమానిపై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 107 కింద జంషెడ్‌పూర్‌ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అతని పండ్ల దుకాణం ముందు పెట్టిన ఫ్లెక్సీలో రాముడు, శివుడు దేవతల చిత్రాలు కూడా ముంద్రించి ఉన్నాయి. దుకాణంపై కాషాయ జెండా కూడా కట్టడంతో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం

అయితే పండ్ల దుకాణం యజమానిపై కేసులు నమోదు చేయడాన్ని హిందూ సంఘాలు, బీజేపీ మండిపడుతున్నాయి. జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సొరేన్ సర్కార్‌ హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తోందంటూ మాజీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పండ్ల దుకాణాదారుడు హిందూ అని పేరు రాయడం తప్పా అంటూ ఆయన ప్రశ్నించారు. హిందూ అని రాయడం ఎప్పుడు నిషేధించారిన ప్రశ్నించారు. ఇతర మతస్థులు కూడా ఇలా జెండాలు, పేర్లు పెడుతుండగా.. హిందువులు పెట్టుకుంటే తప్పేంటన్నారు. ఇతర మతస్థులపై కూడా కేసులు నమోదు చేస్తారా అంటూ ట్విట్టర్‌ వేదికగా పలువురు నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఇక విశ్వ హిందూ పరిషత్ అధికారులు కూడా దీనిపై స్పందించారు. హిందూ అని పేరు పెట్టుకుంటే.. దుకాణాలపై కాషాయ జెండాలు కట్టుకుంటే కేసులు పెట్టడమేంటని ప్రశ్నించారు. ఇదే విధంగా ఇతర మతస్థులు ఎప్పటి నుంచో పెడుతుంటే వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని.. చట్టం అందరికీ ఒకే విధంగా ఉండాలని.. ఎవరి మత విశ్వాసాలు వారివన్నారు. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.