మోదీజీ.. నార్తే కాదు.. సౌత్ కూడా ఉంది..

150వ గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ వ్యవహరించిన తీరు పట్ల.. తెలుగు సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. మోదీ పక్షపాతంగా వ్యవహరించారంటూ సోషల్ మీడియా ద్వారా తమ వాదనలు తెలియజేస్తున్నారు. 150వ గాంధీ జయంతి సందర్భంగా మోదీ ఓ  కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వారిని మాత్రమే అహ్వానించారు. అంతేకాకుండా గాంధీ భావాలను, ఐడియాలను ప్రజలకు చేరువ చేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి సినిమా రంగం ఎక్కువగా దోహదపడుతుందని చెబుతూనే హిందీ ఫిల్మ్ […]

మోదీజీ.. నార్తే కాదు.. సౌత్ కూడా ఉంది..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 20, 2019 | 10:36 AM

150వ గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ వ్యవహరించిన తీరు పట్ల.. తెలుగు సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. మోదీ పక్షపాతంగా వ్యవహరించారంటూ సోషల్ మీడియా ద్వారా తమ వాదనలు తెలియజేస్తున్నారు. 150వ గాంధీ జయంతి సందర్భంగా మోదీ ఓ  కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వారిని మాత్రమే అహ్వానించారు. అంతేకాకుండా గాంధీ భావాలను, ఐడియాలను ప్రజలకు చేరువ చేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి సినిమా రంగం ఎక్కువగా దోహదపడుతుందని చెబుతూనే హిందీ ఫిల్మ్ సెలబ్రిటీలను మాత్రమే ప్రశంసించారు.

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఒక్క స్టార్‌ని కూడా ఆహ్వానించలేదు. దాంతో సౌత్ ప్రజలంతా మోదీ పక్షపాత బుద్ధిపై తీవ్ర వ్యతిరేకతని వ్యక్తం చేశారు. ముఖ్యంగా రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. డియర్ నరేంద్ర మోదీ గారు, మేము సౌత్ ఇండియన్స్.. మీ పాలనని అభిమానిస్తూ, మీరు ప్రధానిగా ఉన్నందుకు గర్వంగా ఫీలవుతాం. కానీ మీ దృష్టిలో సినీ సెలబ్రిటీస్ మరియు కల్చరల్ ఐకాన్స్ కేవలం హిందీకి మాత్రమే పరిమితమా.. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఈ విషయం నన్ను ఎంతో బాధ పెట్టింది. అందుకే ప్రశ్నిస్తున్నా.. ఇది మీకు కరెక్ట్ గా రీచ్ అవుతుందని ఆశిస్తున్నా అని ట్వీట్ చేశారు.

ఉపాసన కొణిదెల చేసిన ట్వీట్‌కి ఎంతో మంది నెటిజన్స్ మద్దతుగా నిలిచారు. ఎందుకంటే దక్షిణాది సినిమా కూడా దేశానికి ఎంతో సపోర్ట్ చేస్తోంది. అలాగే ఇండియన్ సినిమాని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లడంలో తెలుగు చిత్రసీమ కృష్టి ఎంతో ఉంది. అంతేకాక, బాహుబలి, సాహో, సైరా లాంటి పాన్ ఇండియన్ మూవీస్‌‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి క్రేజ్ వచ్చిందో అందరికి తెలిసిన విషయమే.

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
నిడదవోలు ఎన్నికల బరిలో కస్తూరి సత్యప్రసాద్.. ప్రధాన పార్టీలకు దడ
నిడదవోలు ఎన్నికల బరిలో కస్తూరి సత్యప్రసాద్.. ప్రధాన పార్టీలకు దడ