Indian Railways: ప్రయాణికుడి పట్ల మానవత్వం చాటుకున్న రైల్వే TTE.. తన సీటును త్యాగం చేసి..

|

Aug 18, 2022 | 8:59 AM

ఒక్కో సారి చిన్న సహాయమైనా కొంత మందిని ఎంతో ప్రభావితం చేస్తుంది. ఆ చిన్న సహాయమే ఎన్నో మార్పులకు కారణమవుతుంది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం ప్రతి వ్యక్తి ఇతరుల పట్ల దయ, ప్రేమ, కరుణ చూపించడం సర్వసాధారణం..

Indian Railways: ప్రయాణికుడి పట్ల మానవత్వం చాటుకున్న రైల్వే TTE.. తన సీటును త్యాగం చేసి..
Rail Passenger
Follow us on

Indian Railways: ఒక్కో సారి చిన్న సహాయమైనా కొంత మందిని ఎంతో ప్రభావితం చేస్తుంది. ఆ చిన్న సహాయమే ఎన్నో మార్పులకు కారణమవుతుంది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం ప్రతి వ్యక్తి ఇతరుల పట్ల దయ, ప్రేమ, కరుణ చూపించడం సర్వసాధారణం.. చాటా సందర్భాల్లో తోటి వ్యక్తులకు ఎన్నో విధాలుగా సహాయం చేస్తాం. రైలు ప్రయాణంలో అయితే ఇటువంటి సహాయాలకు కొదవేలేదు. వృద్ధులకు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అప్పర్ బెర్తు వస్తే.. వారికి లోయర్ బెర్తు ఇవ్వడం, ఒకే ఫ్యామిలీకి చెందిన వారికి వేర్వేరు బోగీల్లో సీట్లు ఖరారైతే.. మన సీట్లను వారికిచ్చి.. వారి సీట్లలో మనం సర్ధుకోవడం తరచూ రైలు ప్రయాణంలో చూస్తుంటాం. అయితే ప్రతి రైలులో టీటీఈలకు అన్ని విధాలా అనువుగా ఉండేలా బెర్తు కేటాయిస్తారు. ఆసీటును ఇతరులెవరికి కేటాయించరు. అయితే మంగుళూరు సెంట్రల్ మెయిల్ లో ఏడాది పాపతో ప్రయాణిస్తున్న వ్యక్తి ఇబ్బందిని గమనించి.. ఓ టీటీఈ తన బెర్తును ఆ ప్రమాణికుడికి ఇచ్చి.. తాను వేరే బెర్తుకు మారాడు. దీనివల్ల తాను ఎంతో కంపార్ట్ బుల్ గా ఫీలయ్యానంటూ ఆ ప్రయాణీకుడు ట్వీట్ చేశారు. ఏడాది వయస్సు పాపతో రైలులో ప్రయాణిస్తున్న తనకు టీటీఈ ఎలా సహాయం చేశారనే విషయాన్ని ట్విట్టర్ లో పంచుకున్నాడు విశాఖ కృష్ణ, ఓ రెండు పోటోలను కూడా ఆయన పోస్టు చేశాడు.

కన్నూరులో 12601 నెంబర్ రైలులోని B1 కోచ్ లో ఏడాది వయస్సు పాపతో ప్రయాణిస్తున్నప్పుడు.. టీటీఈ తన ఎక్కువ వెలుతురు ఉన్న సీటును తమకు ఇచ్చి.. తాను వేరు సీటుకు మారడం ద్వారా తన ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగా సాగిందని ట్విట్టర్ లో పోస్టు చేశారు. అలాగే తమతో పాటు రైలులో నిద్రపోతున్న ప్రయాణీకులందరికి టీటీఈ రక్షకుడు.. ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. దీనిని భారతీయ రైల్వే తో పాటు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాండిల్స్ కు ట్యాగ్ చేశారు. ఈట్వీట్ కు భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ స్పందిస్తూ… మీ రైలు ప్రయాణం సౌకర్యవంతంగా సాగిందని ఆశిస్తున్నాము. ఎల్లప్పుడూ మీ సేవలో ఉంటామంటూ రిప్లై ఇచ్చింది. ఈపోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. టీటీఈని మెచ్చుకుంటూ ఈప్రపంచంలో ఎంతో మంది దయగల వ్యక్తులు ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..