ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ జులై 12న వివాహం చేసుకున్నారు. అనంత్ అంబానీ మరో వ్యాపారవేత్త అయిన వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్తో అనంత్ అంబానీ వివాహం అట్టహాసంగా జరిపించారు. అనంత్-రాధికల వివాహ వేడుకలు జామ్నగర్లో ప్రీ వెడ్డింగ్ వేడుకతో మొదలై ఇటలీలో క్రూయిజ్ పార్టీ వరకు ఎవరూ ఊహించన రేంజ్లో జరిగింది. హల్దీ, మెహందీ, సంగీత్, వివాహ వేడుకల వరకు కొన్ని రోజుల పాటు సాగాయి. పెళ్లి తర్వాత కూడా రాధిక, అనంత్ తమ సిబ్బందికి, కార్మికులకు శుభ ఆశీర్వాదాలు, మంగళ్ ఉత్సవ్తో పాటు రిసెప్షన్ను నిర్వహించారు.
ఈ వివాహ వేడుకకు ఎందరో ప్రముఖులు, దేశ విదేశీ అతిథులు హాజరయ్యారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లి ఇది. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుకలు ఇక్కడితో ముగియలేదు. ఇండియాలో అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి తంతు ఇప్పుడు లండన్కు షిఫ్ట్ కానుంది.
అందిన సమాచారం ప్రకారం.. అనంత్ అంబానీ వివాహానంతర వేడుకల కోసం సెప్టెంబర్ వరకు స్టాక్ పార్క్ హోటల్ను బుక్ చేసుకున్నారు. ఇక్కడ జరిగే వేడుకలకు ప్రిన్స్ హ్యారీ, బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ హాజరుకానున్నారు. ఈ హోటల్ 300 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. అంబానీ ఈ హోటల్ను రెండు నెలలకు బుక్ చేసుకున్నారు. ఈ సందర్భంగా హోటల్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రజలకు హోటల్లోకి ప్రవేశించడం నిషేధించారు. దాదాపు 850 మంది గోల్ఫ్ క్లబ్ సభ్యులను కూడా ఈ సందర్భంగా క్లబ్కు రావద్దని కోరినట్టుగా తెలిసింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి