Viral News: కజిన్‌ బ్రదర్‌తో ప్రేమలో పడిన యువతి.. మేము పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ నెటిజన్ల అభిప్రాయ సేకరణ..

|

Oct 16, 2024 | 9:07 PM

కలియుగం అంటే ఇదేనేమో.. ఓ యువతి తన సోదరుడితో ప్రేమలో పడింది.. అంతేకాదు తమ ప్రేమ గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు కోపంగా ఉన్నారు.. మేమిద్దరం మూడేళ్లుగా డేటింగ్‌లో ఉన్నాం.. మేము పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాం..అయితే మా కుటుంబ సభ్యులు తమ సంబంధాన్ని వ్యతిరేకిస్తున్నారని.. అయినా సరే తాను అతడిని మాత్రమే పెళ్లి చేసుకుంటానని యువతి సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఈ వింత ప్రేమకు సంబంధించిన కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral News: కజిన్‌ బ్రదర్‌తో ప్రేమలో పడిన యువతి.. మేము పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ నెటిజన్ల అభిప్రాయ సేకరణ..
Weird Love Story
Image Credit source: Getty
Follow us on

ప్రేమ గుడ్డిది అని అంటారు. దానికి కులం, మతం, పేద, వంటి పట్టింపు లేదు. అయితే అమ్మాయి, అబ్బాయి అన్నా చెల్లెల వరస అయ్యేవారు ప్రేమలో పడితే? ప్రస్తుతం అటువంటి వింత ప్రేమకథ ఒకటి సోషల్ మీడియాలో ప్రజలలో చర్చనీయాంశంగా మారింది. కుటుంబ సభ్యులు వీరి సంబంధానికి వ్యతిరేకం.. అయితే అమ్మాయి మొండిగా ఉంది.. తాను అతనిని మాత్రమే పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది. యూనివర్శిటీలో చదువు అయిన తర్వాత తామిరిద్దరి మధ్య సన్నిహితం బాగా పెరిగింది. ఇప్పుడు ఒకరిని విడిచి ఒకరు విడిపోలేమని 26 ఏళ్ల యువతి సోషల్ మీడియాలో వెల్లడించింది.

ది సన్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం గత మూడు సంవత్సరాలుగా తన బంధువు.. సోదరుడు వరస అయిన యువకుడితో సంబంధం.. అతడిని త్వరలో వివాహం చేసుకోవాలనుకుంటున్నట్లు ఆ అమ్మాయి చెప్పింది. చిన్నతనంలో మేమిద్దరం స్నేహితుల్లా ఉండేవాళ్లమని ఆ యువతి చెప్పింది. తామిద్దరం కలిసి తరచుగా నిద్రించే వారమని చెప్పింది. అయితే తామిద్దరి మధ్య ఉన్న బంధాన్ని కెమిస్ట్రీని మా కుటుంబ సభ్యులు గమనించారు. కొన్ని సార్లు తమ మిగతా కజిన్స్ మీరిద్దరూ ప్రేమ పక్షులా అని అడిగేవారని చెపింది.

లాక్‌డౌన్‌ తర్వాత మరింత దగ్గర

మొదట్లో తమ గురించి జోక్ చేస్తున్నారు అని అనుకున్నానని చెప్పింది ఆ అమ్మాయి. అయితే కాలక్రమంలో తామిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకోలేని విధంగా తమ బంధం పెనవేసుకుందని తెలిపింది. గ్రాడ్యుయేషన్ తర్వాత ఇద్దరం తమ కెరీర్‌లో పురోగతి సాధించామని.. అయితే కోవిడ్ -19 కారణంగా లాక్‌డౌన్ తమను మళ్లీ దగ్గరికి తీసుకువచ్చిందని అమ్మాయి చెప్పింది.

ఇవి కూడా చదవండి

అన్నా చెల్లి డేటింగ్ ప్రారంభించారు

వైరల్ అయిన సోషల్ మీడియా పోస్ట్‌లో లాక్డౌన్ కారణంగా మేము ఇద్దరం మళ్లీ దగ్గరయ్యాం. అయితే ఈసారి ఫీలింగ్ చిన్ననాటి స్నేహం, అన్నా చెల్లెల బంధం కాదు.. మేము ప్రేమలో పడ్డాము అని అమ్మాయి చెప్పింది. దీని తరువాత మేము ఇద్దరం తమ కుటుంబ సభ్యుల దృష్టిలో పడకుండా డేటింగ్ చేయడం ప్రారంభించామని తెలిపింది.

అతనిని మాత్రమే పెళ్లి చేసుకుంటాను.

అయితే ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో వారిద్దరూ ఒకరికొకరు దూరంగా ఉండాలని కోరారు. అయితే ఆ అమ్మాయి మాత్రం తన కజిన్ ను మాత్రమే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఈ పెళ్లి వల్ల పుట్టిన పిల్లలు జన్యుపరమైన వ్యాధులతో బాధపడతారని చెప్పినా.. తాను తీసుకున్న నిర్ణయంపై గట్టిగానే నిలబడ్డారు ఇద్దరూ అంతేకాదు తామిద్దరం చట్టబద్ధంగా పెళ్లి చేసుకోవచ్చని కుటుంబ సభ్యులకు చెప్పారు.

ఇది మూర్ఖపు నిర్ణయం అంటున్న నెటిజన్లు

సోషల్ సైట్ రెడ్డిట్‌లో ఈ విషయం చెప్పిన ఆ అమ్మాయి నెటిజన్ల నుంచి సలహాలు కోరింది. ఈ పోస్ట్ కు కామెంట్స్ వరదలా వెల్లువెత్తుతున్నాయి. చాలా మంది వినియోగదారులు దీనిని మూర్ఖపు నిర్ణయం అని .. మీ తల్లిదండ్రుల నిర్ణయానికి కట్టుబడి కట్టుబడి ఉండటానికి ఇంకా సమయం ఉందని అమ్మాయికి చెప్పారు. ఒకరు సమాజం మీ పిల్లలను ఎన్నటికీ అంగీకరించదు.. మీ పిల్లలు బాధపడడం మీరు చూడాలనుకుంటున్నారా అంటూ కామెంట్ చేశారు. అదే సమయంలో దీనిని మానసికంగా పతనం అని అంటారని ఒకరి వ్యాఖ్యానించారు.

 

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..