చెరువు నీటిని గుర్తు తెలియని వ్యక్తులు ఖాళీ చేశారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లాలోని తాండూరు మండలం రేచిని గ్రామంలోని వడ్డీకుంట చెరువులోని నీటిని గుర్తతెలియన వ్యక్తులు బయటికి వదిలాడు. చెరువులోని 10 వేల చేపలు బయటికి వెళ్లడంతో సుమారు రూ.5 లక్షల నష్టం వచ్చినట్లు మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వారిపై తగ్గిన చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. అయితే ఇలా ఎవరు చేశారు ఎందుకు చేశారు అని తెలియాల్సి ఉంది. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది.