Telangana: టీమ్ వర్క్‌కి నిదర్శనం తెలంగాణ.. 8 ఏళ్లలో ఎంతో అభివృద్ధి సాధించామన్న సీఎం కేసీఆర్..

|

Dec 04, 2022 | 3:34 PM

అభివృద్ధే తమ లక్ష్యం అని, ఎవరెన్ని శాపనార్థాలు పెట్టినా అభివృద్ధి చేసి చూపించామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్‌లో పలు అభివృద్ధి..

Telangana: టీమ్ వర్క్‌కి నిదర్శనం తెలంగాణ.. 8 ఏళ్లలో ఎంతో అభివృద్ధి సాధించామన్న సీఎం కేసీఆర్..
Cm Kcr
Follow us on

అభివృద్ధే తమ లక్ష్యం అని, ఎవరెన్ని శాపనార్థాలు పెట్టినా అభివృద్ధి చేసి చూపించామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఆయన అక్కడ ప్రసంగించారు. 8 ఏళ్లలో ఎంతో పురోగతి సాధించామన్నారు. టీమ్ వర్క్ చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని, ఇందుకకు తెలంగాణ రాష్ట్రమే నిదర్శనం అని పేర్కొన్నారు సీఎం కేసీఆర్. గడిచిన 8 సంవత్సరాలలో ఎంతో అభివృద్ధి చెందామన్నారు. రాష్ట్రం ఏర్పడిన రోజున చాలా మంది చాలా రకాలుగా శాపనార్థాలు పెట్టారని గుర్తు చేశారు. చీకటి మయం అవుతుందని, తెలంగాణ ఎడారి అవుతుందని ఏవేవో అన్నారని గుర్తు చేశారు. కానీ, ఇవాళ మనం ఏంటో నిరూపించామన్నారు సీఎం కేసీఆర్. దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలోనే అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

అంతకు ముందు మహబూబ్‌నగర్‌లో సీఎం కేసీఆర్ టీఆఱ్ఎస్ పార్టీ జిల్లా ఆఫీస్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జిల్లాలో ఏర్పాటు చేసిన కొత్త కలెక్టరేట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. సాయంత్రం 4 గంటలకు ఎంవీఎస్ కాలేజీలో బహిరంగ సభలో సీఎం ప్రసగించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..