Telangana: వ‌ర‌ద బాధితుల‌కు అండగా నిలిచిన తెలంగాణ ఉద్యోగులు.. విరాళంగా ఒక రోజు వేత‌నం..!

|

Sep 03, 2024 | 11:34 AM

భారీ వర్షాల కారణంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాలో వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్నాయి. వందలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

Telangana: వ‌ర‌ద బాధితుల‌కు అండగా నిలిచిన తెలంగాణ ఉద్యోగులు.. విరాళంగా ఒక రోజు వేత‌నం..!
Telangana Employees Jac
Follow us on

భారీ వర్షాల కారణంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాలో వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్నాయి. వందలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ముఖ్యంగా మున్నేరు వారు ఉపొంగి, ఖమ్మం నగరం దిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని విభాగాల‌ ప్రభుత్వ ఉద్యోగుల సైతం స‌హాయ‌క చ‌ర్యల్లో నిమ‌గ్నమ‌య్యారు.

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో ఆస్తి, ప్రాణ న‌ష్టం జ‌రిగిందని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ క‌మిటీ ఛైర్మన్ వి.ల‌చ్చిరెడ్డి అన్నారు. సహాయక చర్యల్లో నిమగ్నమైన ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులు సైతం అండగా నిలుస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని విభాగాల‌ ప్రభుత్వ ఉద్యోగులు స‌హాయ‌క చ‌ర్యల్లో నిమ‌గ్నమ‌య్యారని ఆయన గుర్తు చేశారు. ప్రకృతి విప‌త్తు కారణంగా భారీ న‌ష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందన్నారు. ఈ ఘ‌ట‌న త‌మ‌ను తీవ్రంగా క‌లిచివేసింద‌న్న లచ్చిరెడ్డి, కొత్త ప్రభుత్వం ఏర్పడిన త‌ర్వాత ఇది అతిపెద్ద విప‌త్తుగా తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ క‌మిటీ భావించిందన్నారు జేఏసీ ఛైర్మన్ లచ్చిరెడ్డి.

ఇలాంటి స‌మ‌యంలో త‌మ వంతుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్ధిక ప‌రంగా చేయూత‌గా నిల‌వాల‌ని భావించామ‌న్నారు. అందులో భాగంగా రాష్ట్రంలోని ఉద్యోగుల త‌రుపున ఒక రోజు వేత‌నం సుమారు రూ.100 కోట్లను ప్రభుత్వానికి ఇచ్చేందుకు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్నట్లు జేఏసీ ఛైర్మన్ లచ్చిరెడ్డి ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వానికి త‌మ వంతు సహకారం అందిస్తున్నామని తెలిపారు. వ‌ర‌ద బాధితులకు అండగా నిలుస్తామన్నారు.

తెలంగాణ‌లోని అన్ని ప్రభుత్వ విభాగాల‌లోని ఉద్యోగుల త‌రఫున స‌మిష్టి నిర్ణయం తీసుకున్నట్లు లచ్చిరెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా ఉన్న ఉద్యోగులుగా వ‌ర‌ద విప‌త్తు సృష్టించిన ప్రాంతాల‌లో ప్రత్యక్షంగా స‌హాయ‌క చ‌ర్యల్లో పాల్గొన‌డంతో పాటు త‌మ బాధ్యత‌గా ఒక రోజు వేత‌నాన్ని విరాళంగా అందచేయ‌నున్నట్టుగా చెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..