Telangana: దారుణం.. కన్న తల్లితోపాటు ఇద్దరు కూతుళ్ళను హతమార్చిన కసాయి..!

రాను రానూ మనుషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. చాలా మంది చిన్న చిన్నపాటి సమస్యలనూ పెద్దవి చేసి, చివరకు హత్యలు చేసేందుకు కూడా వెనుకాడడం లేదు. కనీసం చిన్న పిల్లలు అని కూడా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. క్షణికావేశంలో ఓ వ్యక్తి పదేళ్ళలోపు ఇద్దరు పిల్లలతో పాటు కన్న తల్లిని హతమార్చాడు. ఖమ్మం జిల్లాలో ఈ దారుణం వెలుగు చూసింది.

Telangana: దారుణం.. కన్న తల్లితోపాటు ఇద్దరు కూతుళ్ళను హతమార్చిన కసాయి..!
Death
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: May 18, 2024 | 2:59 PM

రాను రానూ మనుషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. చాలా మంది చిన్న చిన్నపాటి సమస్యలనూ పెద్దవి చేసి, చివరకు హత్యలు చేసేందుకు కూడా వెనుకాడడం లేదు. కనీసం చిన్న పిల్లలు అని కూడా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. క్షణికావేశంలో ఓ వ్యక్తి పదేళ్ళలోపు ఇద్దరు పిల్లలతో పాటు కన్న తల్లిని హతమార్చాడు. ఖమ్మం జిల్లాలో ఈ దారుణం వెలుగు చూసింది.

తల్లాడ మండలం గోపాలపేట గ్రామానికి చెందిన పిట్టల వెంకటేశ్వర్లు ఆస్తి కోసం తన తల్లితో పాటు ఇద్దరు కుమార్తెలను అత్యంత పాశవికంగా హతమార్చాడు. తన పేరుపై ఆస్తి రాసివ్వడం లేదని కోపం పెంచుకున్న వెంకటేశ్వర్లు.. తల్లి పిచ్చమ్మ(60)ను గొంతు నులిమి చంపాడు. అనంతరం అభం శుభం తెలియని ఇద్దరు కుమార్తెలు నీరజ(10), ఝాన్సీ(6)లను హతమార్చి పరారయ్యాడు.

పొలం తన పేరుపై రాయాలంటూ వెంకటేశ్వర్లు కొన్నేళ్ళుగా తల్లిని వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి కుటుంబంలో ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో తల్లితోపాటు ఇద్దరు కన్న పిల్లలను చంపేశాడు దుర్మార్గుడు. ఇందుకు సంబంధించి స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, వెంకటేశ్వర్లు ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, రెండేళ్ల క్రితం భార్యను కూడా హత్య చేశాడని స్థానికులు తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో అతిభారీ వర్షాలు
వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో అతిభారీ వర్షాలు
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!