
ఎవరికెన్ని అభిప్రాయాలున్నా సరే.. ప్రజలకు సేవ చేసే ఓ బలమైన వేదిక.. జర్నలిజం. ప్రజలకు వందకు వంద శాతం మంచి చేసే ఓ ఫ్లాట్ఫామ్.. జర్నలిజం. ఎవరో ఒకరిద్దరి చర్యలను చూసి ‘జర్నలిజం అంతా ఇంతే’ అంటూ చాలా తక్కువ చేసి మాట్లాడుతుంటారు కొందరు. కాని, రాసిపెట్టుకోండి.. ఇప్పటికీ, ఎప్పటికీ సమాజాన్ని ఓ సరైన దారిలో పెట్టేది కచ్చితంగా జర్నలిజమే. ఆ వృత్తిపై ప్రేమతో, ప్రజలకు సమాజానికి మంచి చేయాలనే కసితో పనిచేస్తూ.. ప్రాణాలు కోల్పోతున్న జర్నలిస్టులు ఎందరో. మీకు తెలుసా.. ప్రపంచంలోనే ప్రమాదకరమైన వృత్తులలో జర్నలిజం కూడా ఒకటి అని ఐక్యరాజ్యసమితి ఓ డెఫినేషన్ ఇచ్చింది. అది నిజం కూడా. న్యాయవాది కావాలంటే లా చదవాలి. డాక్టర్ కావాలంటే మెడిసిన్ చదవాలి. ఉపాధ్యాయుడు కావాలంటే టీచర్ ట్రైనింగ్ తీసుకోవాలి. ఒక్క జర్నలిస్టుకు మాత్రం అన్యాయాన్ని సహించలేని ఫైర్ ఉంటే చాలు. అదే.. జర్నలిస్టులపై దాడులకు కారణం అవుతోంది. ప్రభుత్వానికి కావొచ్చు, మోహన్బాబు లాంటి షార్ట్టెంపర్ వ్యక్తులకు కావొచ్చు.. జర్నలిస్ట్ ఒక సాఫ్ట్ టార్గెట్ ఇప్పుడు. సరిగ్గా మానవ హక్కుల దినోత్సవం అయిన డిసెంబర్ 10వ తేదీనే.. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తూ మోహన్బాబు అనే వ్యక్తి ఏకంగా మీడియాపై దాడి చేశాడు. ఏం.. జర్నలిస్ట్ అంటే అంత తేలికా? డాక్టర్పై చేయ్యెస్తే ఓ చట్టం, జూడాలపై దాడి చేస్తే రక్షణగా చట్టం, ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేస్తే దానికో చట్టం.. మరి...