Crop Loan Waiver Scheme: రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. ముందు రుణమాఫీ వాళ్లకే.. రేషన్ కార్డుపైనా ఫుల్ క్లారిటీ..

|

Jul 16, 2024 | 5:27 PM

రూ.2లక్షల రుణమాఫీకి సంబంధించి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.. కొన్ని వివరణాత్మక అంశాలతో రుణమాఫీ చేయనున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించింది.. దీనికి సంబంధించిన విధివిధానాలను రూపొందించి.. నోడల్ అధికారి నేతృత్వంలో రూ. 2లక్షల రుణమాఫీ అర్హులను ఎంపిక చేయనున్నట్లు వెల్లడించింది.

Crop Loan Waiver Scheme: రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. ముందు రుణమాఫీ వాళ్లకే.. రేషన్ కార్డుపైనా ఫుల్ క్లారిటీ..
Crop Loan Waiver Scheme
Follow us on

రూ.2లక్షల రుణమాఫీకి సంబంధించి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.. కొన్ని వివరణాత్మక అంశాలతో రుణమాఫీ చేయనున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించింది.. దీనికి సంబంధించిన విధివిధానాలను రూపొందించి.. నోడల్ అధికారి నేతృత్వంలో రూ.2లక్షల రుణమాఫీ అర్హులను ఎంపిక చేయనున్నట్లు వెల్లడించింది. రేషన్ కార్డు ప్రమాణికంగా ముందుగా స్వల్పకాలిక రుణాలను మాఫీ చేస్తామని చెప్పింది.. రేషన్ కార్డు లేని వారికి ఆధార్ కార్డు ప్రమాణికంగా రుణాలను మంజూరు చేయనున్నట్లు తెలిపింది. అయితే.. రుణమాఫీ మార్గదర్శకాల విడుదల అనంతరం రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.. షరతుల్లేకుండా రుణమాఫీ చేస్తామని చెప్పి ఇదేంటంటూ అటు బీఆర్ఎస్ .. ఇటు బీజేపీ .. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నాయి.. రుణమాఫీ మార్గదర్శకాలతో ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తే.. రేషన్ కార్డు ప్రామాణికతపై ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొడుతున్నాయని.. అర్హులందరికీ రుణమాఫీ చేసి తీరుతామని అధికార పార్టీ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ సైతం క్లారిటీ ఇచ్చారు. భూమి పాస్ బుక్ ఆధారంగానే కుటుంబానికి రూ.2లక్షల పంట రుణమాఫీ చేస్తామన్నారు. కేవలం కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు నిబంధన పెట్టామన్నారు. కలెక్టర్ల సదస్సులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో ఈ వ్యాఖ్యలు చేశారు.

ముందు లక్ష రుణ మాఫీ..

ఈ నెల 18న లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. జూలై 18న సాయంత్రంలోగా రైతుల రుణఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి.. అదే రోజు రైతు వేదికల్లో రుణమాఫీ లబ్దిదారులతో సంబరాలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఇతర ఖాతాల్లో జమచేసుకుంటే బ్యాంకర్ల పైన కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడిచింది.

రుణమాఫీ ఎగ్గొట్టే ప్రయత్నం..

రుణమాఫీ మార్గదర్శకాలపై బీఆర్‌ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది.. ఆంక్షల పేరుతో రుణమాఫీ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుందని.. కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకోవడం సరికాదంటూ పేర్కొన్నారు. రేషన్ కార్డ్‌ తప్పనిసరి నిబంధనతో రైతులకు అన్యాయం జరుగుతుందని.. బీఆర్‌ఎస్‌ హయాంలో ఆంక్షల్లేకుండానే రుణమాఫీ చేసినట్లు తెలిపారు. షరతులు లేకుండా రుణమాఫీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మొత్తంగా రుణమాఫీ ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని.. పీఎం కిసాన్ నిబంధనలు వర్తింపుతో రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. పీఎం కిసాన్ రూల్స్‌తో సగం మంది రైతులకే మాఫీ జరుగుతుందన్నారు. రైతుల సంఖ్యను కుదించడమే..ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తోందన్నారు మాజీమంత్రి హరీష్‌రావు..

ఉరితాళ్లుగా మారాయి..

రుణమాఫీ మార్గదర్శకాలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. రుణమాఫీ మార్గదర్శకాలు రైతులకు ఉరితాళ్లుగా మారాయన్నారు. రుణమాఫీకి రేషన్‌ కార్డుకు లింక్ పెట్టారని.. పదేళ్ల నుంచి తెలంగాణలో రేషన్ కార్డులు ఇవ్వలేదని ఈటల అన్నారు. రుణమాఫీ ఎగ్గొట్టేందుకే అనేక షరతులు పెట్టారని విమర్శించారు.

విపక్షాలది దుష్ప్రచారం..

రుణమాఫీ మార్గదర్శకాలపై విపక్షాలది దుష్ప్రచారమని ధరణి కమిటీ చైర్మన్‌ కోదండరెడ్డి విమర్శించారు. రుణమాఫీ చేసేది ప్రజల సొమ్ముతో కాబట్టే.. అది దుర్వినియోగం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. రైతులను రెచ్చగొట్టేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కుటుంబ వివరాల కోసమే.. రుణమాఫీకి రేషన్‌కార్డు తప్పనసరి చేశామన్నారు. ఉమ్మడి కుటుంబంలో లేని రైతులు.. కమిటీ ముందు తమ వివరాలు ఉంచితే పరిష్కారం చూపుతుందన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..