Bandi Sanjay: బీజేపీని చూసి పాతబస్తీలో వణుకుతున్నారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..

|

Sep 18, 2022 | 8:10 PM

బీజేపీని చూసి హైదరాబాద్ పాతబస్తీలో కొందరు వణుకుతున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా - పాకిస్థాన్ మ్యాచ్ అప్పుడు.. పాకిస్తాన్ జెండా పట్టినవారే ఇప్పుడు

Bandi Sanjay: బీజేపీని చూసి పాతబస్తీలో వణుకుతున్నారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..
Bandi Sanjay
Follow us on

Bandi Sanjay sensational comments: బీజేపీని చూసి హైదరాబాద్ పాతబస్తీలో కొందరు వణుకుతున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా – పాకిస్థాన్ మ్యాచ్ అప్పుడు.. పాకిస్తాన్ జెండా పట్టినవారే ఇప్పుడు త్రివర్ణ పతాకం పడుతున్నారంటూ పేర్కొన్నారు. బీజేపీకి భయపడే జాతీయ జెండాను పడుతున్నారని పేర్కొన్నారు. ఎంఐఎంకు భయపడే సీఎం కేసీఆర్ నిజాం, ఖాసీం రిజ్వీ అరాచకాల గురించి మాట్లాడలేదంటూ బండి సంజయ్ విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేపడుతున్న నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఆరవ రోజు మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ యాత్రలో బీజేపీ సహా ఇంచార్జ్ అరవింద్ మీనన్ పాల్గొన్నారు.

ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎంఐఎంకు భయపడే జాతీయ సమైక్యత దినోత్సవంలో నిజాం ఆకృత్యాల గురించి సీఎం కేసీఆర్ మాట్లాడలేదన్నారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన పోరాట యోధులను విస్మరించిన సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. గతంలో గిరిజన సమస్యలపై పోరాడి.. బీజేపీ నేతలు జైలు పాలయ్యారని తెలిపారు. బీజేపీ కి వస్తున్న స్పందన చూసి కేసీఆర్ వణికిపతున్నారన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, కమ్యూనిస్టు, ఎంఐఎం పార్టీలు అన్ని ఏకమైనా.. తమ పార్టీని ఏం చేయలేవంటూ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..