Warangal: హాస్టల్‌లో విద్యార్థినుల మధ్య ఘర్షణ.. ఫినాయిల్‌ తాగి ఐదుగురు బాలికల ఆత్మహత్యాయత్నం..

|

Nov 20, 2022 | 1:11 PM

విద్యార్థినుల మధ్య ఘర్షణ జరగడంతో.. ఐదుగురు విద్యార్థినులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన తెలంగాణలోని వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. హన్మకొండ మండలంలోని

Warangal: హాస్టల్‌లో విద్యార్థినుల మధ్య ఘర్షణ.. ఫినాయిల్‌ తాగి ఐదుగురు బాలికల ఆత్మహత్యాయత్నం..
Warangal students
Follow us on

విద్యార్థినుల మధ్య ఘర్షణ జరగడంతో.. ఐదుగురు విద్యార్థినులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన తెలంగాణలోని వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. హన్మకొండ మండలంలోని ఆరెపల్లె గ్రామం వద్ద ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ బాలికల గురుకుల హాస్టల్లో.. విద్యార్థులు ఏదో విషయంపై గొడవపడ్డారు. అనంతరం మనస్థాపం చెందిన ఐదుగురు విద్యార్థినులు ఆత్మహత్యకు యత్నించారు. ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. దీంతో అప్రమత్తమైన హాస్టల్ సిబ్బంది.. ఐదుగురు విద్యార్థినులను వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రాథమిక చికిత్స అనంతరం విద్యార్థినుల ప్రాణాలకు ఎలాంటి ముప్పులేదని వైద్యులు వెల్లడించారు.

హాస్టల్లో జరిగిన ఓ విద్యార్థిని బర్త్ డే వేడుకలతో ఈ గొడవ జరిగినట్లు సమాచారం. ములుగు జిల్లాకు చెందిన బీసీ బాలికల గురుకుల హాస్టల్ ను అధికారులు ఆరెపల్లి వద్ద ఉన్న ఓ భవనంలో నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం హాస్టల్‌లో ఓ విద్యార్థిని బర్త్ డే వేడుకలు జరిగాయి.

హాస్టల్లోని వారు కాకుండా ఇతర విద్యార్థినులు హాజరు కావడంతో వసతి గృహం అధికారులు విద్యార్థినులను మందలించినట్లు సమాచారం. ఈ క్రమంలో హాస్టల్లోని విద్యార్థినుల మధ్య కూడా గొడవ జరిగి.. ఆత్మహత్యాయత్నానికి దారితీసినట్లు పేర్కొంటున్నారు. ఈఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..