Laureus Award: క్రికెట్ దేవుడికి మరో ప్రతిష్టాత్మక పురస్కారం..!

| Edited By:

Feb 18, 2020 | 9:02 AM

క్రికెట్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్టాత్మక లారెస్ స్పోర్టింగ్ మూమెంట్ 2000-2020 అవార్డును సచిన్ అందుకున్నారు. గత రెండు దశాబ్ధాల్లో అత్యుత్తమ స్పోర్ట్స్ మూవెంట్‌కు ఈ అవార్డును అందించడం కోసం ఇటీవల పోటీ నిర్వహించిన విషయం తెలిసిందే. అందులో 19మందితో పోటీపడిన మాస్టర్ బ్లాస్టర్ ప్రథమ స్థానంలో నిలిచి అవార్డును సొంతం చేసుకున్నారు. కాగా 2011లో జరిగిన వన్డే వరల్డ్‌కప్ విజయం తరువాత సచిన్‌ను భారత ఆటగాళ్లు తమ […]

Laureus Award: క్రికెట్ దేవుడికి మరో ప్రతిష్టాత్మక పురస్కారం..!
Follow us on

క్రికెట్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్టాత్మక లారెస్ స్పోర్టింగ్ మూమెంట్ 2000-2020 అవార్డును సచిన్ అందుకున్నారు. గత రెండు దశాబ్ధాల్లో అత్యుత్తమ స్పోర్ట్స్ మూవెంట్‌కు ఈ అవార్డును అందించడం కోసం ఇటీవల పోటీ నిర్వహించిన విషయం తెలిసిందే. అందులో 19మందితో పోటీపడిన మాస్టర్ బ్లాస్టర్ ప్రథమ స్థానంలో నిలిచి అవార్డును సొంతం చేసుకున్నారు. కాగా 2011లో జరిగిన వన్డే వరల్డ్‌కప్ విజయం తరువాత సచిన్‌ను భారత ఆటగాళ్లు తమ భుజాలపై ఎత్తుకొని ఊరేగించిన విషయం తెలిసిందే. దీనికి క్యారీడ్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ నేషన్ అనే క్యాప్షన్‌తో ఓటింగ్ నిర్వహించగా.. ఆ మూవెంట్‌కే ఈ అవార్డు వచ్చింది.

ఈ నేపథ్యంలో జర్మనీలోని బెర్లిన్‌లో లారెస్ అవార్డును అందుకున్న సచిన్ అనంతరం మాట్లాడుతూ.. ప్రపంచకప్‌ విజయాన్ని మాటల్లో వర్ణించలేను. అవి అద్భుత క్షణాలు. నాకు పదేళ్ల వయసున్నప్పుడు భారత్ ప్రపంచకప్‌(1983)ను గెలిచింది. ఆ సమయంలో నాకు దాని మీద పెద్ద అవగాహన లేకపోయినా. ఆ విజయాన్ని అందరితో పాటు సెలబ్రేట్ చేసుకున్నా. కొంతకాలానికి ప్రపంచకప్ విజయం ఎంత ప్రత్యేకమైందో అర్థమైంది. దీంతో మరోసారి దేశానికి ప్రపంచకప్ సాధించాలనే కోరికతో క్రికెట్ ఆడటం మొదలుపెట్టా. 22 ఏళ్ల తరువాత నా కల నెలవేరింది అని వ్యాఖ్యానించారు. తాను గెలిచిన ఈ ట్రోఫీ.. తానొక్కడితే కాదని.. అందరిదీ అని సచిన్ అన్నారు. ఇక 19ఏళ్ల వయస్సు ఉన్నప్పటి నుంచే తనపై దక్షిణాఫ్రికా సూరీడు నెల్సన్ మండేలా ప్రభావం ఉండేదని సచిన్ అన్నారు.