.Royal Challengers Bengaluru vs Lucknow Super Giants: ఐపీఎల్లో విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. భవిష్యత్ లో నెలకొల్పుతూనే ఉంటాడు. ఇక మంగళవారం (ఏప్రిల్ 2) లక్నోతో జరిగిన మ్యాచ్లోనూ విరాట్ కోహ్లీ ఒక అరుదైనరికార్డును ఖాతాలో వేసుకున్నాడు.
ఈ స్టేడియం RCBకి హోమ్ గ్రౌండ్. ఈ నేపధ్యంలో చిన్న స్వామి స్టేడియంలో విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. అదేంటంటే ఈ స్టేడియంలో విరాట్కి ఇది 100వ టీ20. తద్వారా ఒకే మైదానంలో 100 మ్యాచ్లు ఆడిన తొలి భారతీయుడిగా విరాట్ నిలిచాడు.
ఓవరాల్ గా టీ20 క్రికెట్లో ఒకే స్టేడియంలో 100 మ్యాచ్లు ఆడిన 15 క్రికెటర్ గా విరాట్ నిలిచాడు. ఒకే స్టేడియంలో అత్యధిక టీ20 పరుగులు చేసిన ఆటగాడిగా కూడా విరాట్ రికార్డు సృష్టించాడు.
చిన్నస్వామి స్టేడియంలో విరాట్ 39.95 సగటుతో 3, 276 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 25 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
కాగా ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఓటమిపాలైంది. సొంత గడ్డపై ఆ జట్టుకు వరుసగా ఇది రెండో ఓటమి. ఇంతకు ముందు ఇదే గ్రౌండ్ లో కేకేఆర్ చేతిలో చిత్తుగా ఓడింది బెంగళూరు.