IND vs PAK: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు పాకిస్థాన్ వెళ్తుందా? తేల్చేసిన అమిత్ షా.. ఏమన్నారంటే?

|

Sep 09, 2024 | 8:28 PM

ICC Champions Trophy 2025: వచ్చే ఏడాది అంటే 2025లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఐసీసీ ఈవెంట్‌ను విజయవంతం చేసేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికే సన్నాహాల్లో బిజీగా ఉంది. అయితే, ఈ టోర్నీలో పాల్గొనేందుకు టీమిండియా పాకిస్థాన్ వెళ్తుందా లేదా అనే దానిపై అధికారిక సమాచారం లేదు.

IND vs PAK: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు పాకిస్థాన్ వెళ్తుందా? తేల్చేసిన అమిత్ షా.. ఏమన్నారంటే?
Icc Champions Trophy 2025
Follow us on

ICC Champions Trophy 2025: వచ్చే ఏడాది అంటే 2025లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఐసీసీ ఈవెంట్‌ను విజయవంతం చేసేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికే సన్నాహాల్లో బిజీగా ఉంది. అయితే, ఈ టోర్నీలో పాల్గొనేందుకు టీమిండియా పాకిస్థాన్ వెళ్తుందా లేదా అనే దానిపై అధికారిక సమాచారం లేదు. దీనిపై ముందుగా తన స్టాండ్‌ని స్పష్టం చేసిన బీసీసీఐ.. భారత ప్రభుత్వం అనుమతి ఇస్తేనే భారత జట్టును పాక్‌కు పంపుతామని ప్రకటించింది. కాగా, ఈ అంశంపై కీలక ప్రకటన ఇచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు భారత జట్టు పాకిస్థాన్‌కు వెళ్లడం లేదని స్పష్టం చేశారు.

చర్చలకు అవకాశం లేదు..

నిజానికి, గత శుక్రవారం, హోం మంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్‌లో రాబోయే ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా అమిత్‌ షా మాట్లాడుతూ.. పాకిస్థాన్‌ దుందుడుకు చర్యలను ఖండించారు. దీంతో పాటు భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాల మెరుగుదలపై తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించే వరకు పాకిస్థాన్ ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు ప్రారంభించబోమని స్పష్టం చేశారు. బదులుగా, మేము జమ్మూ కాశ్మీర్ యువకుల అభిప్రాయాలను అర్థం చేసుకోవాలనుకుంటున్నాం. వారితో మాట్లాడాలనుకుంటున్నాం” అని ఆయన అన్నారు.

అమిత్ షా ప్రకటనతో అంతా స్పష్టం..

ఇప్పుడు అమిత్ షా ప్రకటనను ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా వర్తింపజేయడం వల్ల భారత ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ భారత ఆటగాళ్లను అక్కడికి పంపి ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోదని తేలిపోయిందని అంటున్నారు. ఇది కాకుండా, కొంతకాలం క్రితం బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా కూడా టీమ్ ఇండియాను పంపే నిర్ణయం పూర్తిగా భారత ప్రభుత్వ చేతుల్లో ఉందని పేర్కొన్నాడు. కాబట్టి పాకిస్థాన్ గురించి అమిత్ షా చేసిన ప్రకటనను పరిశీలిస్తే.. భారత ప్రభుత్వం టీమ్ ఇండియాను పాకిస్థాన్ కు పంపకపోవడం ఖాయం.

ఇవి కూడా చదవండి

హైబ్రిడ్ మోడల్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ?

అమిత్ షా ప్రకటనకు ముందు, బీసీసీఐ ఇప్పటికే ఐసీసీకి ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ ఫార్మాట్‌లో నిర్వహించాలని ప్రతిపాదనను సమర్పించింది. శ్రీలంక లేదా దుబాయ్‌లో టీమిండియా మ్యాచ్‌లు నిర్వహించాలని బీసీసీఐ ఐసీసీని కోరింది. అయితే, ఐసీసీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. నిజానికి, 2023 ఆసియా కప్‌కు ఆతిథ్య హక్కులను కూడా పాకిస్థాన్ దక్కించుకుంది. అయితే అప్పుడు కూడా జట్టును అక్కడికి పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. ఆ తర్వాత పాకిస్థాన్‌, శ్రీలంకలో ఆసియా కప్‌ను నిర్వహించారు. దీని ప్రకారం టీమిండియా తన అన్ని మ్యాచ్‌లను శ్రీలంకలోనే ఆడింది. ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి ఛాంపియన్‌గా కూడా నిలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..