Colombo Pitch and Weather Report: మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్-శ్రీలంక మధ్య ఆదివారం ఆగస్టు 4న కొలంబో వేదికగా రెండో వన్డే జరగనుంది. శుక్రవారం ఇదే మైదానంలో జరిగిన తొలి మ్యాచ్ టై అయింది. దీంతో ఇరు జట్లూ ఈ సిరిస్ను కైవసం చేసుకోవాలంటే నేటి మ్యాచ్లో విజయం సాధించాలనే ఒత్తిడిలో ఉన్నాయి. ఓ వైపు గెలిచే మ్యాచ్లో డీలా పడిన భారత జట్టు నిరుత్సాహంగా ఉండగా.. మరోవైపు ఓడిన మ్యాచ్ను టై చేసిందన్న ఆత్మవిశ్వాసంతో లంక జట్టు దూసుకుపోతోంది. దీంతో రెండో వన్డే మ్యాచ్లో ఉత్కంఠ పెరిగింది.
తొలి వన్డే మ్యాచ్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొన్నప్పటికీ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించలేదు. అయితే ఆదివారం వర్షం కురిసే సూచన ఉంది. దీంతొ మరోసారి ఉత్కంఠ మ్యాచ్ చూసేందుకు అభిమానులకు అవకాశం ఉంటుందా లేదా అనేది చూడాలి. కొలంబో పిచ్ గురించి చెప్పాలంటే ఇక్కడ పరుగులు చేయడం కష్టం. రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ మరింత కష్టం. రెండో వన్డేకు ముందు కొలంబో వాతావరణం, పిచ్ నివేదికను చూద్దాం
ఆగస్ట్ 4న మధ్యాహ్నం 73%, సాయంత్రం 70% వర్షం పడే అవకాశం ఉందని అక్యూవెదర్ తెలిపింది. మ్యాచ్ ఆద్యంతం వర్షం కురిసే అవకాశం ఉన్నా.. తొలి వన్డేపై మాత్రం ప్రభావం పడలేదు. ఈ మ్యాచ్లోనూ అదే జరుగుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఉష్ణోగ్రత సుమారు 28-30 డిగ్రీలు ఉంటుంది. తేమ దాదాపు 80% ఉన్నట్లు నివేదించబడింది.
ఆగస్టు 2న ప్రేమదాస మైదానంలో జరిగిన తొలి వన్డేలో స్పిన్నర్లు అద్భుత ప్రదర్శన చేశారు. తద్వారా రెండో వన్డే మ్యాచ్లోనూ స్పిన్నర్లకు అండగా నిలిచే అవకాశం ఉంది. తొలి వన్డేలో భారత్ 10 వికెట్లలో 9 వికెట్లను శ్రీలంక స్పిన్నర్లు తీశారు. భారత స్పిన్నర్లు 8 వికెట్లలో 4 వికెట్లు తీయగా, ఫాస్ట్ బౌలర్లు 4 వికెట్లు తీశారు.
భారత్, శ్రీలంక జట్లు ఇప్పటి వరకు 169 వన్డే మ్యాచ్లు ఆడాయి. ఇందులో భారత్ 99 మ్యాచ్లు గెలవగా, శ్రీలంక 57 మ్యాచ్లు గెలిచింది. మిగిలిన 12 మ్యాచ్లు ఫలితం లేకుండా ముగిశాయి.
వన్డే సిరీస్ కోసం టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..