IPL 2024: రిషబ్ పంత్ టీంకు భారీ షాక్.. ఇద్దరు స్టార్ ప్లేయర్లు తప్పుకునే ఛాన్స్.. కారణం ఏంటంటే?
David Warner Injury: IPL 2024 ప్రారంభానికి ఇంకా ఒక నెల కంటే తక్కువ సమయం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వార్నర్ టోర్నీకి ముందు కోలుకోగలడా లేదా అనే ప్రశ్న తలెత్తుతోంది. గత సీజన్లో రిషబ్ పంత్ గైర్హాజరీలో వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్కు బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఈసారి ఆడటంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఐపీఎల్లో వార్నర్ అందుబాటులో లేకుంటే రిషబ్ పంత్ జట్టుకు భారీ షాక్ అనే చెప్పుకోవాలి.
David Warner Injury: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024)కు మరికొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో కొందరు ఆటగాళ్లు గాయపడడం ఇప్పుడు ఫ్రాంచైజీలను ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా పటిష్టమైన జట్టును రంగంలోకి దించాలని పట్టుదలతో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోని ఇద్దరు ఆటగాళ్లు గాయపడ్డారు. డేవిడ్ వార్నర్ న్యూజిలాండ్తో జరిగిన మూడు మ్యాచ్ల T20 సిరీస్లో మొదటి మ్యాచ్ని ఆడాడు. ఆ తర్వాత రెండవ మ్యాచ్కు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు గాయం కారణంగా సిరీస్లోని మూడవ, చివరి మ్యాచ్కు అతను దూరమయ్యాడు. వార్నర్ గాయం కారణంగా IPL 2024కి ముందు ఢిల్లీ క్యాపిటల్స్కు సమస్యలు పెరిగాయి.
IPL 2024 ప్రారంభానికి ఇంకా ఒక నెల కంటే తక్కువ సమయం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వార్నర్ టోర్నీకి ముందు కోలుకోగలడా లేదా అనే ప్రశ్న తలెత్తుతోంది. గత సీజన్లో రిషబ్ పంత్ గైర్హాజరీలో వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్కు బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఈసారి ఆడటంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఐపీఎల్లో వార్నర్ అందుబాటులో లేకుంటే రిషబ్ పంత్ జట్టుకు భారీ షాక్ అనే చెప్పుకోవాలి.
క్రికెట్ ఆస్ట్రేలియా వార్నర్ గాయంపై ఒక ప్రకటన విడుదల చేసింది. “అతనికి ప్రస్తుతం కోలుకునే వ్యవధి బాగానే ఉంది. ఇది T20 ప్రపంచ కప్నకు ముందు జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్కు అతని లభ్యతను ప్రభావితం చేయదు” అని పేర్కొంది.
ఐపీఎల్కు ముందే వార్నర్ కోలుకుంటాడని ప్రకటన ద్వారా స్పష్టమైంది. ఐపీఎల్కు ముందు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ నిజంగా కోలుకుంటారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే, ఈసారి ఐపీఎల్ ఆడనున్న రిషబ్ పంత్ గురించి ఇంకా అధికారిక సమాచారం రాలేదు. అయితే పంత్ ఆడటం ఖాయమని పలు మీడియాల్లో కథనాలు వచ్చాయి.
తొలి మ్యాచ్లో వార్నర్ 32 పరుగులు..
వెల్లింగ్టన్లో న్యూజిలాండ్తో జరిగిన మొదటి టీ20ని ప్రారంభించినప్పుడు, డేవిడ్ వార్నర్ 20 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్ల సహాయంతో 32 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆడాడు. ఆ మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. 216 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా విజయం సాధించింది.
జే రిచర్డ్సన్ కూడా..
మరోవైపు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఎంపికైన ఆస్ట్రేలియన్ స్పీడ్స్టర్ జే రిచర్డ్సన్ గాయం కారణంగా ఐపీఎల్ ప్రథమార్థానికి అందుబాటులో ఉండక తప్పలేదు. రిచర్డ్సన్ సైడ్ స్ట్రెయిన్ సమస్యతో బాధపడుతున్నాడని, ఓపెనింగ్ మ్యాచ్ల్లో ఆడడం లేదని ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని పార్త్ జిందాల్ తెలిపాడు.
ఈసారి ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తన తొలి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. పీసీఏ స్టేడియం మార్చి 23న మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్ ద్వారా రిషబ్ పంత్ తిరిగి పోటీ క్రికెట్లోకి రానున్నాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: రిషబ్ పంత్, ప్రవీణ్ దూబే, డేవిడ్ వార్నర్, విక్కీ ఓస్త్వాల్, పృథ్వీ షా, ఎన్రిక్ నోకియా, అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, లుంగి ఎన్గిడి, లలిత్ యాదవ్, ఖలీల్ అహ్మద్, మిచెల్ మార్ష్, ఇషాంత్ శర్మ, ఇషాంత్ శర్మ. హ్యారీ బ్రూక్, ట్రిస్టన్ స్టబ్స్, రికీ భుయ్, కుమార్ కుషాగ్రా, రసిఖ్ దార్, జే రిచర్డ్సన్, సుమిత్ కుమార్, షాయ్ హోప్, స్వస్తిక్ చికారా.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..