Yadadri Temple: యాదాద్రి గోపురానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే భారీ విరాళం.. 2కిలోల బంగారం అందజేత..

|

Nov 28, 2021 | 6:34 AM

Yadadri Temple: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి 2 కిలోల బంగారాన్ని విరాళంగా అందజేశారు..నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. ప్రధాన ఆలయ విమాన గోపుర స్వర్ణ తాపడానికి...

Yadadri Temple: యాదాద్రి గోపురానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే భారీ విరాళం.. 2కిలోల బంగారం అందజేత..
Yadadri Temple
Follow us on

Yadadri Temple: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి 2 కిలోల బంగారాన్ని విరాళంగా అందజేశారు..నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. ప్రధాన ఆలయ విమాన గోపుర స్వర్ణ తాపడానికి బంగారాన్ని సమర్పించారు. విరాళం ఇవ్వడం ద్వారా తన 22 ఏళ్ల మొక్కు నెరవేరిందన్నారు ఎమ్మెల్యే. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారికి వేదాశీర్వచనం చేశారు..అంతకు ముందు ఆలయ మర్యాదాలతో సంప్రదాయబద్దంగా ఆయనకు స్వాగతం లభించింది. ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు ఎమ్మెల్యే. ఈ సందర్భంగా ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు.

Also read:

శీతాకాలంలో నైట్ క్రీమ్ కోసం డబ్బు వృధా చేస్తున్నారా..! దీనికంటే మంచిది మరొకటి ఉండదు..

Bike Loan: లోన్‌ తీసుకొని బైక్‌ కొంటున్నారా..! ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి..

Car prices: జనవరిలో కార్ల ధరలు మళ్లీ పెరిగే అవకాశం.. కంపెనీలు ఏం చెబుతున్నాయంటే..?