పరప్పణ అగ్రహారంలో పాచికలు.. చిన్నమ్మ గూటిలో సంథింగ్‌ స్పెషల్‌.. తమిళక్షేత్రంలో రాజకీయ రణరంగం..

ఈసారి అమ్మలేదు. అన్నాడీఎంకేకి ఆమె బొమ్మే మిగిలింది. కానీ చిన్నమ్మ ఉంది. జైలు గోడల మధ్య నుంచి బయటికొచ్చి లైవ్‌ పాలిటిక్స్‌ నడపబోతోంది. ఆదాయానికి మించిన ఆస్తులు..

పరప్పణ అగ్రహారంలో పాచికలు.. చిన్నమ్మ గూటిలో సంథింగ్‌ స్పెషల్‌.. తమిళక్షేత్రంలో రాజకీయ రణరంగం..
Follow us

|

Updated on: Jan 09, 2021 | 8:48 PM

ఈసారి అమ్మలేదు. అన్నాడీఎంకేకి ఆమె బొమ్మే మిగిలింది. కానీ చిన్నమ్మ ఉంది. జైలు గోడల మధ్య నుంచి బయటికొచ్చి లైవ్‌ పాలిటిక్స్‌ నడపబోతోంది. ఆదాయానికి మించిన ఆస్తులు, అక్రమార్జన కేసులో జైలుపాలైన జయలలిత సహచరి శశికళ ఈనెల 27న రిలీజ్‌ కాబోతున్నారు. బెంగళూరు పరప్పణ అగ్రహారం జైలులో నాలుగేళ్లుగా శిక్ష అనుభవిస్తున్నారు శశికళ, ఇళవరసి, సుధాకరన్‌. చిన్నమ్మతో పాటు మిగిలిన ఇద్దరూ బయటికి రాబోతున్నారు. చిన్నమ్మ జైలుపాలుకాగానే అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం పేరుతో కొత్త పార్టీ పెట్టారు శశికళ మేనల్లుడు దినకరన్‌. ఇప్పుడు ఏఎంఎంకేని చిన్నమ్మ ఎలాంటి వ్యూహంతో ముందుకు తీసుకెళ్తారన్నది ఆసక్తిరేపుతోంది.

జైలుకెళ్లేముందు జయలలిత సమాధిని చరిచి ప్రమాణంచేసిన శశికళ… తమిళనాట కీలకం కాబోతున్నారు. ప్రస్తుత సీఎం పళనిస్వామిని అప్పట్లో సీఎం సీట్లో కూర్చోబెట్టింది శశికళనే. అయితే ఒకప్పుడు ఒంగిఒంగి దండాలు పెట్టినవాళ్లు ఇప్పుడు నిటారుగా నిలబడ్డారు. ఓ వైపు అమ్మ పార్టీ, మరోవైపు చిన్నమ్మపార్టీ. అన్నాడీఎంకేలో ఉంటూనే శశికళ కాళ్లుమొక్కే నేతలున్నారు. శశికళ బయటికి రాగానే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కొందరు పార్టీ వీడే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.

చిన్నమ్మ బయటికొచ్చాక ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌తో పళనిస్వామి, పన్నీర్‌సెల్వంలకు నిద్రపట్టటం లేదు. ఓ దశలో ఇద్దరి మధ్య నాయకత్వపోరు జరిగినా…పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీరుస్తుందేమోనని భయపడి…చివరికి రాజీపడ్డారు. సర్వసభ్య సమావేశంతో శనివారం అన్నాడీఎంకే అగ్రనేతలంతా ఓ వేదికపైకొచ్చారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపై సమాలోచనలు జరిపారు. శశికళ రిలీజ్‌ తర్వాత పరిణామాలపైనా చర్చించారు. 11 మందితో స్టీరింగ్‌ కమిటీని ఆమోదించారు. మొత్తం 16 తీర్మానాలు చేశారు. ఎన్నికల్లో పార్టీలతో పొత్తు వ్యవహారాలపై సర్వాధికారాలను పళనిస్వామి, పన్నీర్‌సెల్వంలకు కట్టబెట్టారు.

అన్నాడీఎంకే నేతల తీరుపై బీజేపీతో పాటు పీఎంకే, డీఎండీకే పార్టీలు అసంతృప్తితో ఉన్నాయి. దీంతో మిత్రపక్షాలను బుజ్జగించబోతున్నారు ఈపీఎస్‌, ఓపీఎస్‌. పీఎంకే కూడా తమకు డిప్యూటీ సీఎం పదవి కావాలంటోంది. వన్నియార్లకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ఒత్తిడి ఉంది. ఓవైపు శశికళతో తలపడుతూనే…సొంతింటి సవాళ్లను పళని, పన్నీర్‌ ఎలా అధిగమిస్తారో చూడాలి.

ఇవి కూడా చూడండి :

Chang’e 4 Mission : చికటి నుంచి వెలుగులోకి చాంగే-4 ల్యాండర్.. పరిశోధనలు మళ్లీ షురూ Racial Abuse : భారత ఆటగాళ్లపై ఆసీస్ అభిమానుల బండబూతులు.. ఐసీసీకి ఫిర్యాదు చేసిన బీసీసీఐ