ఏపీ సర్కార్ కీలక నిర్ణయం : ఇకపై రైతుభరోసా కేంద్రాల్లో గిరిజన ఉత్పత్తుల అమ్మకం
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్లను రైతుభరోసా కేంద్రాలకు అనుసంధానిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్లను రైతుభరోసా కేంద్రాలకు అనుసంధానిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఇకనుంచి గిరిజన ఉత్పత్తుల కొనుగోళ్లు భరోసా కేంద్రాల ద్వారానే జరుగుతాయని స్పష్టం చేసింది. గిరిజన ప్రాంతాల్లోని సహజ ఉత్పత్తులకు మార్కెటింగ్ మరింతగా కల్పించాలనే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య అధికారులు కీలక సూచనలు చేశారు. ఈ ప్రక్రియ ద్వారా కొనుగోలు, మార్కెటింగ్ ప్రక్రియలు సమన్వయంతో సాగుతాయని ఏపీ సర్కార్ భావిస్తోంది.
Also Read :
పబ్జీ ఆడేందుకు ఫోన్ ఇవ్వలేదని బ్లేడ్తో గొంతు కోసుకున్నాడు
కరోనా కొత్త జన్యువు గుర్తించిన మలేసియా : పది రేట్లు వేగంగా వైరస్ వ్యాప్తి