అడవిలో తలైవా లకలక.. అది టైగర్ ఫారెస్ట్..అక్కడా ఓ మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోగ్రాం

సూపర్ స్టార్ రజినీకాంత్.. ప్రధాని మోదీ బాటలో నడిచేందుకు రెడీ అయినట్టు కనిపిస్తోంది. ఆ మధ్య మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోగ్రాం కోసం మోదీ.. బేర్ గ్రిల్స్ తో కలిసి కర్నాటకలోని బందిపోరా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కి వెళ్లి అక్కడ.. ప్రకృతికి, మానవాళికి మధ్య సమతూకాన్ని బేరీజు వేస్తే.. నేడు తలైవా కూడా దాదాపు అదే పంథాలో సాగారు. కేవలం డిస్కవరీ ఛానల్ కోసం ఆ ప్రోగ్రాం ను ఆ నాడు ఉద్దేశించారు. అయితే ఇప్పుడు […]

అడవిలో తలైవా లకలక.. అది  టైగర్ ఫారెస్ట్..అక్కడా ఓ  మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోగ్రాం
Follow us

| Edited By: Srinu

Updated on: Jan 28, 2020 | 5:46 PM

సూపర్ స్టార్ రజినీకాంత్.. ప్రధాని మోదీ బాటలో నడిచేందుకు రెడీ అయినట్టు కనిపిస్తోంది. ఆ మధ్య మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోగ్రాం కోసం మోదీ.. బేర్ గ్రిల్స్ తో కలిసి కర్నాటకలోని బందిపోరా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కి వెళ్లి అక్కడ.. ప్రకృతికి, మానవాళికి మధ్య సమతూకాన్ని బేరీజు వేస్తే.. నేడు తలైవా కూడా దాదాపు అదే పంథాలో సాగారు. కేవలం డిస్కవరీ ఛానల్ కోసం ఆ ప్రోగ్రాం ను ఆ నాడు ఉద్దేశించారు. అయితే ఇప్పుడు రజినీ సైతం ఇదే షో కోసం ఇక్కడ అడుగు పెట్టారు.

ఈ ఫారెస్ట్ లోని నాలుగు వేర్వేరు లొకేషన్స్ లో షూట్ జరగనుంది. ఇందుకు బందిపూర్ అటవీశాఖ కూడా అనుమతించింది. కానీ.. ఇక్కడ రాత్రుళ్ళు షూటింగ్ జరపరాదని, పేలుడు పదార్థాలను ఉపయోగించకూడదని, చెట్లకు, జంతువులకు నష్టం కలిగించరాదని ఆంక్షలు విధించింది. ఈ షూట్ కు సహకరించేందుకు స్పెషల్ టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కూడా షూట్ లో జాయిన్ కావచ్ఛునని తెలుస్తోంది. డిస్కవరీ ఛానల్ కోసం ప్రత్యేకంగా పని చేస్తున్న బేర్ గ్రిల్స్,, తలైవాను ఆప్యాయంగా ఆహ్వానించాడు. వీరి కాంబోలో ఈ  షో అదుర్స్ అనిపించడం ఖాయమేగా మరి !