రాజన్నసిరిసిల్ల జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు

తెలంగాణ‌లో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. కొత్త‌గా రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో తొలి క‌రోనా పాజిటివ్ కేసు న‌మోదైంది.

రాజన్నసిరిసిల్ల జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు
Follow us

|

Updated on: Apr 10, 2020 | 9:45 AM

తెలంగాణ‌లో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. కొత్త‌గా రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో తొలి క‌రోనా పాజిటివ్ కేసు న‌మోదైంది. వేముల‌వాడ నుంచి ఢిల్లీ మ‌ర్క‌జ్ ప్రార్థ‌న‌ల‌కు వెళ్లి వ‌చ్చిన వ్య‌క్తికి క‌రోనా సోకిన‌ట్లుగా నిర్ధార‌ణ అయ్యింది. దీంతో జిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంది. జిల్లాలో ప్ర‌త్యేక స‌ర్వేలు చేప‌ట్టింది.
రాష్ట్రంలో కోవిడ్ క్ర‌మ‌క్ర‌మంగా విస్త‌రిస్తోంది. గురువారం ఒక్కరోజే 18 మందికి వైర‌స్ నిర్ధార‌ణ కాగా, ఒక‌రు చ‌నిపోయారు. దీంతో తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ కేసుల సంఖ్య 471కి చేరింది. అలాగే మృతుల సంఖ్య 12 దాటింది. బాధితుల్లో గురువారం నాటికి 45 మంది క‌రోనా నుంచి కోలుకుని డిశార్జి అయిన‌ట్లుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల తెలిపారు. ఈ రోజు 60 నుంచి 70 మందిని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్న‌ట్లు స్ప‌ష్టం చేశారు.