పోలింగ్ ఏర్పాట్లపై అఖిలప్రియ ఆగ్రహం!

ఎన్నికల వేళ కర్నూలు జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ఏర్పాట్లు దారుణంగా ఉన్నాయని రాష్ట్ర మంత్రి భూమా అఖిల ప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడవలు జరుగుతున్నా, ఈవీఎంలు సరిగ్గా పనిచేయకపోయినా ఎవరూ పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ఆళ్లగడ్డలో పీడీ యాక్ట్ కింద కేసు నమోదైన వాళ్లు పోలింగ్ బూతులలో ఉంటున్నారన్నారు. పోలింగ్ శాతం తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ప్రజలు మంచికి ఓటు వేస్తారన్న నమ్మకం తనకుందన్నారు. పోలింగ్ బూత్‌ల దగ్గర.. జనాలను కంట్రోల్ చేయలేకపోతున్నారని విమర్శించారు. ఎస్పీకి, […]

పోలింగ్ ఏర్పాట్లపై అఖిలప్రియ ఆగ్రహం!
Follow us

| Edited By:

Updated on: Apr 11, 2019 | 4:35 PM

ఎన్నికల వేళ కర్నూలు జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ఏర్పాట్లు దారుణంగా ఉన్నాయని రాష్ట్ర మంత్రి భూమా అఖిల ప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడవలు జరుగుతున్నా, ఈవీఎంలు సరిగ్గా పనిచేయకపోయినా ఎవరూ పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ఆళ్లగడ్డలో పీడీ యాక్ట్ కింద కేసు నమోదైన వాళ్లు పోలింగ్ బూతులలో ఉంటున్నారన్నారు. పోలింగ్ శాతం తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ప్రజలు మంచికి ఓటు వేస్తారన్న నమ్మకం తనకుందన్నారు. పోలింగ్ బూత్‌ల దగ్గర.. జనాలను కంట్రోల్ చేయలేకపోతున్నారని విమర్శించారు. ఎస్పీకి, డీఎస్పీలకు ఫిర్యాదు చేశామన్నారు. పోలింగ్ బూత్‌ దగ్గర ఒక్క కానిస్టేబుల్ కూడా లేరన్నారు.