నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. కన్నడ ఇండస్ట్రీలో వచ్చిన ఈ చిన్నది టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ అమ్మడు. అలాగే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది.
తెలుగులో మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ తో పుష్ప సినిమాలు చేసింది. పుష్ప సినిమా భారీ హిట్ అందుకుంది.
తెలుగుతో పాటు తమిళ్, హిందీ బాషల్లోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను అలరిస్తుంది. హిందీలో వరుసగా సినిమాలు చేస్తోంది ఈ చిన్నది. తాజాగా ఈ బ్యూటీ యానిమల్ సినిమాతో అక్కడ భారీ హిట్ అందుకుంది.
ఇదిలా ఉంటె తాజాగా రష్మిక మందన్న చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మోడీ సర్కార్ అటల్ సేతు ముంబై నుండి ముంబైకి, గోవా నుండి ముంబైకి మరియు బెంగళూరు నుండి ముంబైకి తక్కువ సమయంలో ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది.
మరోవైపు రష్మిక మందన్న టాలీవుడ్కు గ్యాప్ ఇచ్చి.. బాలీవుడ్పై ఫోకస్ చేసారు. పుష్ప 2 ఒక్కటే రష్మిక చేస్తున్న పెద్ద సినిమా. సమంత, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్.. వీళ్ళంతా సీనియర్స్ కావడంతో ఆఫర్స్ తగ్గిపోయాయి.