‘కరోనా వైరస్ పాండమిక్’ నడుమ పార్లమెంట్ ప్రారంభం
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. 18 రోజులపాటు సాగే ఈ సభాకార్యకలాపాలు పాలీ కార్బన్ షీట్లతో ఎంపీల మధ్య (భౌతిక) దూరం పెంచాయి. జీరో అవర్ ను కుదించడం..
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. 18 రోజులపాటు సాగే ఈ సభాకార్యకలాపాలు పాలీ కార్బన్ షీట్లతో ఎంపీల మధ్య (భౌతిక) దూరం పెంచాయి. జీరో అవర్ ను కుదించడం, ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేయడం ఈ సెషన్ లో ముఖ్య విశేషం. రాజ్యసభ ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు, లోక్ సభ మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటలవరకు కొనసాగనున్నాయి. సమావేశాలకు ముందు మాట్లాడిన ప్రధాని మోదీ..చైనాకు గట్టి హెచ్చరిక చేశారు. కాగా 18 బిల్లులు లిస్ట్ ఎజెండాలో ఉన్నాయి. లడాఖ్ సరిహద్దుల్లో చైనా ఆక్రమణ, కరోనా వైరస్, ఎకానమీ ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చకు రానున్నాయి.
నాలుగు గంటల సిటింగ్స్ ఉంటాయని, వారంలో ఏడు రోజులూ సభా కార్యకలాపాలు కొనసాగుతాయని పార్లమెంట్ వర్గాలు తెలిపాయి, కేవలం లిఖిత ప్రశ్నలు, వాటికి సమాధానాలను మాత్రమే అనుమతించనున్నారు. క్వశ్చన్ అవర్ ను రద్దు చేయడంపట్ల ప్రభుత్వంపై విపక్షాలు మండిపడుతున్నాయి. పైగా ఎప్పటి మాదిరి సాగే అఖిల పక్ష సమావేశాన్ని కూడా ఈ సారి రద్దు చేశారు. కరోనా వైరస్ టెస్ట్ చేయించుకున్న ఎంపీల్లో బీజేపీ ఎంపీ సుకాంత్ మజుందార్ ఒక్కరే పాజిటివ్ గా తేలారు.
#MonsoonSession of the Parliament begins. pic.twitter.com/d3CfaQT9v1
— ANI (@ANI) September 14, 2020