క‌రోనా అల‌ర్ట్ః మాంసాహారం, మసాలాలతో సమస్యలు

ఇటీవ‌ల గాంధీ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగుల‌కు పెడుతున్న ఆహారంపైన కూడా మంత్రి ఈట‌ల స్ప‌ష్ట‌తనిచ్చారు. అయితే, తాజాగా గాంధీ ఆస్ప‌త్రి సూప‌రింటెండెంట్ రాజారావు క‌రోనా

క‌రోనా అల‌ర్ట్ః మాంసాహారం, మసాలాలతో సమస్యలు
Follow us

|

Updated on: Apr 27, 2020 | 3:46 PM

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో ప్ర‌తివిష‌యంలోనూ అల‌ర్ట్ ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ మేర‌కు వైర‌స్ బారిన‌ప‌డ్డవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి. ఏయే ప‌దార్థాలు తింటే వైర‌స్ నుండి త్వ‌ర‌గా కోలుకుంటారో తెలుసుకోవాల‌ని ఇప్పుడు అంద‌రూ గూగుల్‌లో తెగ స‌ర్చ్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల గాంధీ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగుల‌కు పెడుతున్న ఆహారంపైన కూడా మంత్రి ఈట‌ల స్ప‌ష్ట‌తనిచ్చారు. అయితే, తాజాగా గాంధీ ఆస్ప‌త్రి సూప‌రింటెండెంట్ రాజారావు క‌రోనా పేషెంట్లు ఏ ఆహారం తీసుకోవాల‌నే దానిపై పూర్తి క్లారిటీ ఇచ్చారు.

రాష్ట్రంలో న‌మోద‌వుతున్న క‌రోనా కేసుల‌న్నింటిలో దాదాపుగా అంద‌రికీ సికింద్రాబాద్ గాంధీ ఆస్ప‌త్రిలోనే చికిత్స అందిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా వారికి అందించే ఆహారం విష‌యంలో త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు వైద్యాధికారులు.  కరోనా బాధితులుకు గాంధీ ఆస్పత్రి సిబ్బంది వెజిటబుల్‌ బిర్యానీ, కిచిడీ, తాజా పండ్లు అందిస్తున్న‌ట్లుగా సూప‌రింటెండెంట్ రాజారావు తెలిపారు. ఆహారంతో పాటు రోజూ డ్రైఫ్రూట్స్‌, కోడిగుడ్లు అందిస్తున్నట్లు చెప్పారు. మాంసాహారం, మసాలాల వల్ల ఇతర సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అనుమతించట్లేదని వివరించారు.

గాంధీలో మాంసాహారానికి అనుమతి లేదని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్ ఎం రాజారావు స్పష్టం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులకు ఇంటి నుంచి ఎవరైనా మాంసాహారం తీసుకొస్తే అనుమతించబోమని తెలిపారు. రంజాన్‌ మాసం సందర్భంగా ఇఫ్తార్‌ కోసం బయటి వ్యక్తులు తీసుకొచ్చే మాంసాహారాన్ని కూడా అనుమతించబోమని స్పష్టం చేశారు. దీనికి బదులు పండ్లు, డ్రైఫ్రూట్స్‌ తెచ్చి ఇవ్వవచ్చని తెలిపారు. గాంధీలో రోగులకు మాంసాహారం అందిస్తున్నారని, రంజాన్ స్పెషల్స్ ఇస్తున్నారంటూ రెండు, మూడు రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్న వేళ.. సూపరింటెండెంట్ రాజారావు స్ప‌ష్ట‌తనిచ్చారు.