ఏపీలో రెండోసారి కరోనా సోకిన కేసులు నమోదు కాలేదు
ఏపీలో ఇప్పటివరకు ఒకే వ్యక్తికి రెండోసారి కరోనా సోకిన కేసులు ఎక్కడా నమోదు కాలేదని ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీఎస్ జవహర్ రెడ్డి అన్నారు
Andhra Pradesh Corona: ఏపీలో ఇప్పటివరకు ఒకే వ్యక్తికి రెండోసారి కరోనా సోకిన కేసులు ఎక్కడా నమోదు కాలేదని ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీఎస్ జవహర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కరోనా మరణాలను తగ్గించే దిశగా పనిచేస్తున్నామని, తమ ప్రణాళికలకు మంచి ఫలితాలు వస్తున్నాయని వెల్లడించారు. రోజుకు 10వేల కొత్త కేసులు వస్తున్నా.. మరణాల రేటు 1శాతం కంటే తక్కువగానే ఉందని పేర్కొన్నారు. ఎక్కువ కేసులు నమోదవుతున్న అన్ని రాష్ట్రాల కంటే ఏపీలో మరణాలు రేటు తక్కువగా ఉందని ఆయన వివరించారు. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కేసులు పెరుగుతున్నాయని అన్నారు.
ఇక ఇప్పటికే 4 జిల్లాల్లో సీరో సర్వేలెన్సు చేపట్టామని, మిగిలిన 9 జిల్లాల్లో కూడా సర్వే కొనసాగుతుందని జవహర్ రెడ్డి తెలిపారు. ఏపీలో 30 రోజులకు కేసులు రెట్టింపు అవుతున్నాయని, 96శాతం కంటైన్మెంట్ క్లస్టర్లోనే కేసులు వస్తున్నాయని ఆయన అన్నారు. కరోనా సోకకుండా ప్రజలను చైతన్యం చేసేందుకు ప్రచారం చేస్తున్నామని., ప్రజల కోసం 104 కాల్ సెంటర్, హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని జవహర్ రెడ్డి పేర్కొన్నారు. 204 హాస్పిటల్లో పేషెంట్లు ఉన్నారు. 217 హాస్పిటల్స్లో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశాం. 14 వేలకు పైగా ఫోన్కాల్లకు సమాధానం చెప్పాము. కొన్ని పత్రికల్లో వైద్యులను బాధ కలిగించేలా వార్తలు రాస్తున్నారు. ఓ ప్రధాన పత్రికలో ఖాళీల బోర్డులు పెట్టలేదని పచ్చి అబద్ధాలు రాశారు. ఇలాంటి ఘటనలు దురదృష్టకరం.’ అని పేర్కొన్నారు.
Read More:
షాకింగ్ న్యూస్.. శానిటైజర్లలో 50 శాతం కల్తీవట
బీజేపీలో చేరేందుకు వెళ్లిన రౌడీ షీటర్.. పోలీసులను చూసి పరార్