PM Modi Varanasi visit: దీపావళి సందర్భంగా సొంత నియోజకవర్గానికి ప్రధాని మోదీ రూ. వేల కోట్ల కానుకలు!

| Edited By: Balaraju Goud

Oct 18, 2024 | 10:29 AM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 20న తన సొంత పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో ఆరు గంటలపాటు బస చేయనున్నారు.

PM Modi Varanasi visit: దీపావళి సందర్భంగా సొంత నియోజకవర్గానికి ప్రధాని మోదీ రూ. వేల కోట్ల కానుకలు!
Pm Modi
Follow us on

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 20న తన సొంత పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించనున్నారు. సుమారు ఆరు గంటలపాటు కాశీలోనే బస చేయనున్నారు. ఉత్తరాదిన పెద్ద పండుగగా జరుపుకునే దీపావళి పర్వదినానికి కొద్ది రోజుల ముందే వారణాసితో సహా దేశవ్యాప్తంగా రూ. 3,254.03 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌లను చేపట్టనున్నారు. రూ.380.13 కోట్లతో 15 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, రూ.2,874.17 కోట్లతో రెండు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. వారణాసి పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సిగ్రా స్పోర్ట్స్ స్టేడియంలో బహిరంగ సభలో కూడా ప్రసంగిస్తారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వారణాసి నుంచే దేశంలోని 6 విమానాశ్రయాలను అభివృద్ధి చేసే ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. బాగ్‌డోగ్రా (బెంగాల్), దర్భంగా (బీహార్), ఆగ్రా (యూపీ) విమానాశ్రయాల్లో కొత్త సివిల్‌ ఎన్‌క్లేవ్‌ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. వాటి అంచనా వ్యయం రూ.3,041 కోట్లు. ఇది కాకుండా, రేవా ఎయిర్‌పోర్ట్‌లో కొత్త టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణం, మా మహామాయ ఎయిర్‌పోర్ట్ అంబికాపూర్‌లో కొత్త టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణం, సర్సావా ఎయిర్‌పోర్ట్‌లో సివిల్ ఎన్‌క్లేవ్ నిర్మాణ ప్రాజెక్టులను ఆయన వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. వీటి కోసం రూ.255.18 కోట్లు ఖర్చు చేయనున్నారు.

వారణాసి నుంచి ప్రారంభించే పథకాలు, ప్రాజెక్టులు:

  • ఆర్‌జే శంకర కంటి ఆసుపత్రి – రూ.90 కోట్లు
  • స్పోర్ట్స్ కాంప్లెక్స్ పునరాభివృద్ధి, సిగ్రా – రూ.216.29 కోట్లు
  • రానాథ్‌లో పర్యాటక పునరాభివృద్ధి పనులు – రూ.90.20 కోట్ల CIPET కాంప్లెక్స్
  • కర్సాడలో హాస్టల్ నిర్మాణం – రూ.13.78 కోట్లు
  • డా. భీమ్‌రావ్ అంబేద్కర్ స్పోర్ట్స్ స్టేడియం హాస్టల్ మరియు పెవిలియన్ నిర్మాణం – రూ. 12.99 కోట్లు
  • వారణాసి నగరంలోని 20 పార్కుల సుందరీకరణ, పునరాభివృద్ధి పనులు – రూ. 7.85 కోట్లు
  • ఐటీఐ చౌకఘాట్, ఐటీఐ కరౌండిలో హైటెక్ ల్యాబ్ నిర్మాణం – రూ. 7.08 కోట్లు
  • వారణాసిలోని సెంట్రల్ జైలులో బ్యారక్‌ల నిర్మాణ పనులు – రూ. 6.67 కోట్లు
  • కర్సాడలోని CIPET కాంప్లెక్స్‌లో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సెంటర్ నిర్మాణం – రూ. 6.00 కోట్లు
  • బాణాసుర్ టెంపుల్, గురుధామ్ టెంపుల్‌లో టూరిజం అభివృద్ధి పనులు – రూ. 6.02 కోట్లు
  • ట్రూల్ జైలు నిర్మాణ పనులు, 48 మంది ఉద్యోగుల నివాస భవనాలు – రూ. 5.16 కోట్లు
  • టౌన్ హాల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు – రూ. 2.51 కోట్లు
  • భర్తరాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నివాస భవనాల నిర్మాణం – రూ. 2.16 కోట్లు
  • కమ్యూనిటీ హెల్త్ సెంటర్, చిరాయిగావ్ – రూ.1.93 కోట్లు
  • కాకరమట్ట ఫ్లైఓవర్ క్రింద పార్కింగ్ నిర్మాణం – రూ.1.49 కోట్లు.

మోదీ శంకుస్థాపన చేయనున్న ప్రాజెక్టులుః

  • బాబత్‌పూర్‌లో లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం (వారణాసి) విస్తరణ, టెర్మినల్ భవనం – రూ. 2870 కోట్లు
  • కస్తూర్బా గాంధీ విద్యాలయం, అరజిలైన్‌లో ఎడ్యుకేషనల్ బ్లాక్ మరియు బాలికల హాస్టల్ నిర్మాణం – రూ. 4.17 కోట్లు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..