కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన నిరంతరం కొనసాగుతుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 (NFSA) ద్వారా ప్రతి ఇంటికి 5 కిలో ధాన్యం ఉచితంగా అందిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది ప్రజలకు లబ్ది చేకూరుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) కింద రేషన్ కార్డ్ హోల్డర్కు 5 కిలోల ఉచిత రేషన్ కేటాయింపును వచ్చే ఐదేళ్ల పాటు కొనసాగుతుందన్నారు.
ఏప్రిల్ 2020లో ఏర్పడ్డ ఆర్థిక సంక్షోభం కారణంగా, కేంద్ర ప్రభుత్వం PMGKAYని ప్రతి రేషన్ కార్డ్ హోల్డర్కు అదనంగా 5 కిలోల ఆహార ధాన్యాలను సబ్సిడీ ధరలకు అందించింది. రేషన్ కార్డ్ హోల్డర్లకు 5 కిలోల ఆహార ధాన్యాలను అందించాలని మోదీ సర్కార్ నిర్ణయించింది. ఏప్రిల్ 2020 నుండి రేషన్ కార్డ్ హోల్డర్లు ఒక్కొక్కరికి 10 కిలోల రేషన్ అందిస్తూ వస్తోంది. NFSA కింద సబ్సిడీ ధరపై 5 కిలోలు, PMGKAY కింద 5 కిలోలు ఉచితంగా సరఫరా చేస్తోంది. ఇక ఆ తర్వాత 2022 జనవరి నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నగా మార్చింది. ఈ పథకం కింద ప్రతి రేషన్ కార్డ్ హోల్డర్కు 5 కిలోల రేషన్ ఉచితంగా అందిస్తోంది. కాగా, మోదీ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం కారణంగా దేశవ్యాప్తంగా 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడగలిగారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు.
UP: Union Minister Pralhad Joshi says, "…We provide 5 kilograms of grain every month to 80 crore people… Before PM Modi took charge of the country, previous govt had slogans like 'Garibi Hatao' & 'Roti Kapda Makaan,' but nothing substantial happened. For the first time in… pic.twitter.com/FqPGO0UHxR
— IANS (@ians_india) July 11, 2024
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…