కరోనాకు గుడ్ బై.. సింగర్ కనికా కపూర్ డిశ్చార్జ్

కరోనా వ్యాధికి గురైన బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ పూర్తిగా కోలుకున్నారు. లక్నో లోని సంజయ్ గాంధీ పీజీ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో జరిపిన ఆరోసారి జరిపిన టెస్ట్ లో ఆమెకు నెగెటివ్ రిపోర్టు వచ్చినట్టు డాక్టర్లు తెలిపారు.

కరోనాకు గుడ్ బై.. సింగర్ కనికా కపూర్ డిశ్చార్జ్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 06, 2020 | 12:13 PM

కరోనా వ్యాధికి గురైన బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ పూర్తిగా కోలుకున్నారు. లక్నో లోని సంజయ్ గాంధీ పీజీ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో జరిపిన ఆరోసారి జరిపిన టెస్ట్ లో ఆమెకు నెగెటివ్ రిపోర్టు వచ్చినట్టు డాక్టర్లు తెలిపారు. దీంతో ఆమెను డిశ్చార్జ్ చేశారు. అయితే ఆమె రెండు వారాల పాటు హోమ్ క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుంది. గత మార్చి 20 న కనికా కు కరోనా పాజిటివ్ లక్షణాలు సోకినట్టు మొదటిసారిగా బయటపడింది. అయితే ఆమె ఈ విషయాన్ని దాచిపెట్టి లక్నోలో పలువురు రాజకీయ, సినీ, పారిశ్రామిక దిగ్గజాలకు విందునిచ్చింది. దీంతో వారంతా తాము కూడా టెస్టులు చేయించుకోవడంతో అందరికీ నెగెటివ్ రిపోర్టు రావడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. తన కరోనా రోగ విషయాన్ని కనికా కపూర్ దాచిపెట్టిందని, అధికారులకు తెలియజేయకుండా నిర్లక్ష్యం వహించిందని లక్నో అధికారులు ఇఛ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఆమెపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఆమెకు లక్నో ఆసుపత్రిలో వరుసగా  ఐదు సార్లు జరిపిన టెస్టుల్లో పాజిటివ్ వఛ్చిన సంగతి విదితమే.. ఐదో సారీ నెగెటివ్ రిపోర్టు వస్తుందన్న ఆమె ఆశ నిరాశ అయింది. చివరకు కనికా కపూర్ ఆశ ఫలించి.. ఆరో సారి నెగెటివ్ వచ్చింది. కరోనా రోగులకు ప్రతి 48  గంటల కొకసారి టెస్టులు చేయాల్సి ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు.

Latest Articles