‘నాన్నకు ప్రేమతో..నా చివరి ఫోటో’… ప్రియాంక గాంధీ

మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం ఆయన కుమార్తె, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆయనకు శ్రధ్ధాంజలి ఘటించారు. ఆయనతో చివరిసారి తాను దిగిన ఫోటోను ట్వీట్ చేశారు.

'నాన్నకు ప్రేమతో..నా చివరి ఫోటో'... ప్రియాంక గాంధీ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 21, 2020 | 7:13 PM

మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం ఆయన కుమార్తె, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆయనకు శ్రధ్ధాంజలి ఘటించారు. ఆయనతో చివరిసారి తాను దిగిన ఫోటోను ట్వీట్ చేశారు.  అప్పుడు ఆమెకు 19 ఏళ్ళు.. 1991 మే 21 న తమిళనాడులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా రాజీవ్ గాంధీ ఓ సూసైడ్ బాంబర్ చేతిలో హతులయ్యారు. తన తండ్రి స్మృతులను ప్రియాంక గుర్తు చేసుకుంటూ.. తనకు ఆయన నుంచి ఎంత మనోధైర్యం వచ్చిందో వివరించారు. ద్వేషాన్ని చూపేవారి  పట్ల కూడా ఎంత ప్రేమగా ఉండాలో, విచారంలో ఉన్నా ఎంత నిబ్బరంగా ఉండాలో, తాను ఆయన నుంచి నేర్చుకున్నానని ఆమె పేర్కొన్నారు. అటు-రాహుల్ గాంధీ కూడా తన తండ్రిని గుర్తుకు తెచ్చుకుంటూ.. ఒక దేశభక్తి పరుడి కుమారుడినైనందుకు గర్విస్తున్నానని అన్నారు. ఆయన వర్దంతి రోజున ఆయనకు వినమ్రంగా సెల్యూట్ చేస్తున్నా అని రాహుల్ ట్వీట్ చేశారు.