PM Modi: ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ.. జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాని

|

Aug 15, 2024 | 7:49 AM

78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఆయన వరుసగా 11వ సారి జాతీయ జెండాను అవిష్కరించి, జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.

78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఆయన వరుసగా 11వ సారి జాతీయ జెండాను అవిష్కరించి, జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం (ఆగస్టు 15) దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో త్యాగాల ఫలితమే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. త్యాగధనులు అందరినీ స్మరించుకునే రోజు ఇది అని ప్రధాని మోదీ అన్నారు. దేశం కోసం పోరాడిన ప్రాణాలు ఆర్పించిన మహానీయులకు దేశం రుణపడి ఉంటుంది.

అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ రాజ్‌ఘాట్‌కు చేరుకున్నారు. ఇక్కడ ఆయన జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అనంతరం ప్రధాన మంత్రి మోదీతోసహా కేంద్ర మంత్రులు గిరిరాజ్ సింగ్, మన్సుఖ్ మాండవియా, భూపేంద్ర పటేల్ ఎర్రకోటకు చేరుకున్నారు. కేంద్ర మంత్రులు చిరాగ్ పాశ్వాన్, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్ కూడా చేరుకున్నారు.

వీడియో చూడండి..