Prachand helicopters: మేడ్ ఇన్ ఇండియా ‘ప్రచండ’ హెలికాప్టర్ల కొనుగోలుకు విదేశాల నుంచి ఆర్డర్లు..!

|

Sep 17, 2024 | 4:08 PM

మేకిన్‌ ఇండియా.. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమమిది. పదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ ఎక్స్‌క్లూసివ్‌ ప్రోగ్రామ్‌తో భారత్‌ వండర్స్‌ సృష్టిస్తోంది. క్రమంగా దేశంలో తయారీ రంగం పైచేయి సాధిస్తూ.. ఉత్పత్తి భారీగా పెరుగుతోంది.

Prachand helicopters: మేడ్ ఇన్ ఇండియా ప్రచండ హెలికాప్టర్ల కొనుగోలుకు విదేశాల నుంచి ఆర్డర్లు..!
Prachand Helicopter
Follow us on

మేకిన్‌ ఇండియా.. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమమిది. పదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ ఎక్స్‌క్లూసివ్‌ ప్రోగ్రామ్‌తో భారత్‌ వండర్స్‌ సృష్టిస్తోంది. క్రమంగా దేశంలో తయారీ రంగం పైచేయి సాధిస్తూ.. ఉత్పత్తి భారీగా పెరుగుతోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మేడిన్‌ ఇండియా వస్తువులకు డిమాండ్‌ పెరుగుతోంది. ఈ క్రమంలోనే రక్షణ రంగంలో భారతదేశం దృష్టి స్వయం సమృద్ధిగా ఉండటమే. గత కొన్నేళ్లుగా భారత్‌లో అనేక రక్షణ పరికరాలు, ఆయుధాలు, హెలికాప్టర్లు తయారవడానికి ఇదే కారణం.

తాజాగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HCL) నుంచి నాలుగు తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లు ‘ప్రచండ’ కొనుగోలు చేసేందుకు నైజీరియా సిద్ధమవుతోంది. వీటిని కొనుగోలు చేసేందుకు సాఫ్ట్ క్రెడిట్ కోసం నైజీరియా ఏర్పాట్లు చేస్తోంది. నైజీరియా ఆర్మీ అధికారులు ధృవ్ హెలికాప్టర్‌ను నడపడంలో ప్రాక్టీస్ చేసిన సంగతి తెలిసిందే..! మేకిన ఇండియాలో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో ప్రచండను ఈ హెలికాప్టర్‌పై నిర్మించారు.

వాస్తవానికి నిజానికి, ప్రచండ బరువు పరంగా చాలా తేలికైన హెలికాప్టర్‌. ఇది సీమ్‌పై శత్రువుల కార్యకలాపాలపై నిఘా ఉంచడంలో సహాయపడుతుంది. ప్రచండకు ఇద్దరు కూర్చునే సామర్థ్యం ఉంది. దీని పొడవు 51.10 అడుగులు, ఎత్తు 15.5 అడుగులు. దాని బరువు 5800 కిలోలు. ఈ హెలికాప్టర్ గంటకు 268 కి.మీ వేగంతో ప్రయాణించగలదు. దీని పోరాట పరిధి 550 కిలోమీటర్లు.

ఈ హెలికాప్టర్‌లోని మరో ప్రత్యేకత ఏమిటంటే ఎగరగల సామర్థ్యం. ఇది ఏకంగా మూడున్నర గంటలపాటు నిరంతరంగా ఎగరగలదు. ధృవ్ హెలికాప్టర్ల నుంచి ఈ హెలికాప్టర్‌ను రూపొందించారు. 1999లో కార్గిల్ యుద్ధ సమయంలో ఈ హెలికాప్టర్ అవసరమని భారత సైన్యం భావించింది. ఆ తర్వాతే దానికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి.

ఇప్పుడు ఆయుధాల పరంగా చూస్తే, ఈ హెలికాప్టర్‌లో 20 mm M621 ఫిరంగి లేదా నెక్స్టర్ THL-20 టరెట్ గన్‌ని అమర్చవచ్చు. రాకెట్లు, క్షిపణులు, బాంబులను కూడా నాలుగు హార్డ్ పాయింట్లలో అమర్చవచ్చు. ఈ హెలికాప్టర్‌లో అత్యాధునిక ఏవియానిక్స్ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో శత్రువులను కనుగొనడం చాలా సులభం. ఇది రాడార్, లేజర్ హెచ్చరిక వ్యవస్థతో అనుసంధానం చేయబడి ఉంటుంది, దీని కారణంగా శత్రువులు దాడి చేయలేరు.

భారత్‌ మారుతోంది. ఒప్పుడు ఎన్నో దిగుమతులు.. ఇప్పుడు అన్నీ ఉత్పత్తులే. మేకిన్‌ ఇండియా నినాదం క్రమంగా ప్రతిఫలాలను ఇస్తోంది. ప్రధాని మోదీ కలలు సాకారమవుతుండడంతో పాటు.. దేశం అన్ని రంగాల్లో పురోగమిస్తోంది. 2014లో ప్రతిష్టాత్మకంగా మేకిన్‌ ఇండియాను లాంచ్‌ చేశారు మోదీ. భారత్‌ను ప్రపంచంలో టాప్‌ ఉత్పత్తి దేశంగా మార్చేందుకు కలలు కన్నారు. దీనికోసం పక్కా ప్రణాళికలతో ముందుకు సాగారు. పదేళ్ల తర్వాత ఇప్పుడు దాని ప్రతిఫలాలను దేశం చూస్తోంది. 2014లో దేశంలో 80శాతం మొబైల్ ఫోన్లను దిగుమతి చేసుకునే పరిస్థితుల్లో ఉంటే.. ఇప్పుడు 99.9శాతం మొబైల్స్‌ ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయి. అంతేకాదు.. యూకే, నెదర్లాండ్స్‌, ఆస్ట్రియా, ఇటలీ, సౌతాఫ్రికా వంటి దేశాలకు ఎగుమతులు కూడా సాగుతున్నాయి. డిఫెన్స్‌ ప్రొడక్షన్‌తోపాటు.. అంతరిక్షం, ఎలక్ట్రిక్‌ వాహనాలు, సెమీకండక్టర్ల తయారీ, నిర్మాణ రంగం, రైల్వే ఇన్‌ఫ్రాలోనూ అద్భుత ఫలితాలను సాధిస్తోంది.

బ్రహ్మోస్‌ శక్తి సౌత్‌ చైనా సముద్రంలో కనిపిస్తోంది. ఫిలిప్పీన్స్‌ మన బ్రహ్మోస్‌ను కొనుగోలు చేసి.. చైనా సముద్రంలో మోహరించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా జరిగే బ్లాక్‌ఫ్రైడే సేల్స్‌, సైబర్‌ మండే సేల్స్‌లో మేడిన్‌ ఇండియా ఉత్పత్తులనే భారీగా కొంటున్నారంటే ఈ కామర్స్‌ మార్కెట్‌లో మన డామినేషన్‌ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రపంచానికి ఫ్యూచర్‌ మ్యూనుఫాక్చరింగ్‌ హబ్‌ మనదే.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..