కోడి రెట్టతో కరెంటు తయారు చేసిన వ్యక్తి..! తన ఇంటితో పాటు గ్రామంలో వెలుగులు..

|

Aug 28, 2023 | 2:38 PM

రామ్‌హర్ గతంలో భారత సైన్యంలో పనిచేశాడు. సుబేదార్ పదవి నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత రామెహర్ పౌల్ట్రీ ఫారాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత కోడి రెట్టల నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను ఏర్పాటు చేశాడు. గతంలో 85, 85 క్యూబిక్ మీటర్ల రెండు ట్యాంకులు తయారు చేసి దాని నుంచి గ్యాస్ సిద్ధం చేశారు. అప్పుడు అతను 50% గ్యాస్, 50% డీజిల్‌తో జనరేటర్‌ను నడపడం ప్రారంభించాడు, 30 కిలోవాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశాడు.

కోడి రెట్టతో కరెంటు తయారు చేసిన వ్యక్తి..! తన ఇంటితో పాటు గ్రామంలో వెలుగులు..
Electricity With Chicken Du
Follow us on

భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకు ఇప్పటికీ సరైన విద్యుత్ కనెక్షన్ లేదు. మారుమూల గ్రామాలు లేక ఇతర కారణాలతో కొన్ని ప్రాంతాలకు ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం కల్పించలేదు. అందుకే అలాంటి గ్రామాలు నేటికి అంధకారంలో జీవించాల్సిన పరిస్థితి. ఇందులో హర్యానాకు చెందిన జజ్జర్ కుటుంబం కూడా ఒకటి. హర్యానాకు చెందిన జజ్జర్ కుటుంబం విద్యుత్ కనెక్షన్ లేకపోవటంతో చీకట్లోనే ఉంటున్నారు. దీంతో విసిగిపోయిన కుటుంబ సభ్యులు ఓ కీలక నిర్ణయానికి వచ్చారు. సొంతంగా కరెంటు తయారు చేసుకోవాలని పథకం వేసి అందులో విజయం సాధించారు.. వారు విద్యుత్తును ఉత్పత్తి చేసి వినియోగించడమే కాకుండా మరికొందరు విద్యుత్‌ విక్రయిస్తున్నారు కూడా. ఇందుకోసం వారు కోడి రెట్టతో కరెంటును తయారు చేశారు.

అవును మీరు చదివింది నిజమే.. జజ్జర్‌ కుటుంబం ఇప్పుడు కోడి రెట్టతో కరెంట్‌ తయారు చేసింది. కోడి రెట్టతో విద్యుత్ ఉత్పత్తి చేయడంతో పాటు ఆ ప్రాంతమంతా పరిశుభ్రతకు ప్రధాన్యమిస్తున్నారు. కోడి పెంట దుర్వాసన నుంచి కూడా ఉపశమనం కలిగించారు. ఇళ్లు, ఇంటి పనులన్నింటికీ ఈ కరెంటును ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ఈ కుటుంబం కోడి రెట్ట నుంచి దాదాపు 50 కిలోవాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. పౌల్ట్రీ ఫారంలోనే విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన పరికరాలు అమర్చి 24 గంటల పాటు ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి నిర్వహిస్తున్నారు.

ఝజ్జర్‌లోని సిలానీ కేషో గ్రామానికి చెందిన రామెహర్ విద్యుత్ కనెక్షన్ కోసం చాలాసార్లు విద్యుత్ కార్పొరేషన్‌ను సందర్శించాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది.. దీంతో విసుగెత్తిపోయిన రామెహర్ తన ఇంట్లోనే విద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించుకున్నాడు. వ్యవసాయ శాఖ సాయం పొందిన రైతు రామెహర్ తన ఇంట్లో 20 వేల కోళ్లను పెంచుతున్నాడు.. రామెహర్ మొదట్లో కోడి రెట్టలతో గ్యాస్ తయారు చేసేవాడు. ఆ గ్యాస్‌నే తన ఇంటి అవసరాలకు వాడుకున్నాడు. దాంతోనే అతడికి మరో ఆలోచన వచ్చింది. కోడి రెట్టతో విద్యుత్ తయారు చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు రామెహర్‌ ఇల్లు పర్యాటక కేంద్రంలా మారింది. దేశం నలుమూలల నుంచి సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు.

ఇవి కూడా చదవండి

రామ్‌హర్ గతంలో భారత సైన్యంలో పనిచేశాడు. సుబేదార్ పదవి నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత రామెహర్ పౌల్ట్రీ ఫారాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత కోడి రెట్టల నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను ఏర్పాటు చేశాడు. గతంలో 85, 85 క్యూబిక్ మీటర్ల రెండు ట్యాంకులు తయారు చేసి దాని నుంచి గ్యాస్ సిద్ధం చేశారు. అప్పుడు అతను 50% గ్యాస్, 50% డీజిల్‌తో జనరేటర్‌ను నడపడం ప్రారంభించాడు, 30 కిలోవాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశాడు.

రామ్‌హెర్ 2011లో 160 క్యూబిక్ మీటర్ల డైజెస్టర్ ట్యాంక్‌ను నిర్మించారు. ఇద్ర సాయంతో 50 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి అయింది. ఇప్పుడు 240 క్యూబిక్ మీటర్ల ట్యాంక్ తయారు చేశారు. రామ్‌హెర్‌కు ఇప్పుడు విద్యుత్ శాఖ నుండి విద్యుత్ అవసరం లేదు. ఇంట్లో తయారవుతున్న విద్యుత్‌ను వినియోగిస్తున్నారు.

24 గంటలూ విద్యుత్తు తయారీ పనులు జరుగుతున్నాయి. రామ్‌హెర్ తన ఇంటికి కరెంటు వాడడమే కాకుండా ఇతరులకు అమ్మేవాడు. తండ్రి స్ఫూర్తితో రామ్‌హెన్‌ పిల్లలు మరో గ్రామంలో విద్యుత్‌ ఉత్పత్తిని కూడా ప్రారంభించారు. కోడి పేడతో సీఎన్‌జీని తయారు చేసేందుకు ప్రయత్నాలు చేశామని, అయితే ఇప్పటి వరకు ఆ ప్రయత్నం ఫలించలేదని రామెహర్ చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..