శ్రీనగర్, మొహర్రం ఊరేగింపులో హింస, 19 మందికి గాయాలు

శ్రీనగర్ లో జరిగిన మొహర్రం ఊరేగింపులో అల్లర్లు, హింస చెలరేగాయి. ఇక్కడి బెమినా ప్రాంతంలో 'ముహర్రం టాజియా'  ప్రోసెషన్ ని షియా ముస్లిములు నిర్వహిస్తుండగా..

శ్రీనగర్, మొహర్రం ఊరేగింపులో హింస, 19 మందికి గాయాలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 30, 2020 | 1:25 PM

శ్రీనగర్ లో జరిగిన మొహర్రం ఊరేగింపులో అల్లర్లు, హింస చెలరేగాయి. ఇక్కడి బెమినా ప్రాంతంలో ‘ముహర్రం టాజియా’  ప్రోసెషన్ ని షియా ముస్లిములు నిర్వహిస్తుండగా.. ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది. తమను కంట్రోల్ చేయడానికి వస్తున్న పోలీసులపై కొందరు రాళ్లు రువ్వడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు మొదట లాఠీ ఛార్జి చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో బాష్పవాయువు,   పెల్లెట్లను సైతం ప్రయోగించడంతో 19 మంది గాయపడ్డారు. వీరిలో కొంతమంది ముఖాలకు గాయాలయ్యాయి. వీరిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

అటు శ్రీనగర్ లోని మరికొన్ని ప్రాంతాల్లోనూ స్వల్ప  ఘర్షణలు జరిగాయి.