లోయలో ఆర్మీ కూంబింగ్‌.. పట్టుబడుతున్న ఆయుధాల డంప్‌లు..

కశ్మీర్‌ లోయలో జమ్ముకశ్మీర్‌ పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు, రాష్ట్రీయ రైఫిల్స్‌ సిబ్బంది సంయుక్తంగా కూంబింగ్ చేపడుతున్నారు. గత కొద్ది రోజులుగా కశ్మీర్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సర్చ్ ఆపరేషన్‌లు..

లోయలో ఆర్మీ కూంబింగ్‌.. పట్టుబడుతున్న ఆయుధాల డంప్‌లు..
Follow us

| Edited By:

Updated on: Jul 08, 2020 | 6:11 AM

కశ్మీర్‌ లోయలో జమ్ముకశ్మీర్‌ పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు, రాష్ట్రీయ రైఫిల్స్‌ సిబ్బంది సంయుక్తంగా కూంబింగ్ చేపడుతున్నారు. గత కొద్ది రోజులుగా కశ్మీర్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సర్చ్ ఆపరేషన్‌లు చేపడుతున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఉగ్రవాదుల స్థావరాలతో పాటు.. ఆయుధాల డంప్‌లను స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా.. మంగళవారం నాడు భద్రతా బలగాలు సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో బారాముల్లా జిల్లా ఉరి సెక్టార్‌లోని మైదాన్‌ నాలలో ఆయుధాల డంప్‌ను గుర్తించారు. మంగళవారం మధ్యాహ్నం పెద్ద ఎత్తున కూంబింగ్ చేపడుతుండగా.. మూడు ఏకే-56 రైఫిల్స్‌, రెండు పిస్టల్స్‌, మ్యాగజైన్లతో పాటు.. ఇతర ఆయుధాలను, మందు గుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఇండియన్ ఆర్మీ అధికారికంగా ధృవీకరించింది.