బ్రేకింగ్: తమిళనాడులో మొదలైన ఎంఫాన్ తుఫాన్ ముప్పు..

| Edited By:

May 17, 2020 | 4:42 PM

దక్షిణ తమిళనాడులో ఎంఫాన్ తూఫాన్ ముప్పు మొదలైంది. సేలం, ఈరోడ్, కోయింబత్తూర్ జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈరోడ్, సత్యమంగళంలలో ఈదురు గాలులతో కూడిన..

బ్రేకింగ్: తమిళనాడులో మొదలైన ఎంఫాన్ తుఫాన్ ముప్పు..
Follow us on

దక్షిణ తమిళనాడులో ఎంఫాన్ తూఫాన్ ముప్పు మొదలైంది. సేలం, ఈరోడ్, కోయింబత్తూర్ జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈరోడ్, సత్యమంగళంలలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. దీంతో భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. భవానిసాగర్ పరివాహక ప్రాంతాలలో భారీ వర్షానికి ఇళ్ళు నేలకూలాయి. గంట పాటు నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. కాగా ఈ తుఫాన్ ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా.. గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాన్ ప్రయాణిస్తోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేసింది కేంద్ర హోంశాఖ.

అయితే ఈ ఎంఫాన్ తుఫాన్ ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద కూడా ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. 18 నుంచి 20వ తేదీ మధ్యలో ఈశాన్య దిశకు దారి మార్చుకుని ప్రభావం చూపించబోతోంది. దీని వల్ల తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయన్నారు. ప్రత్యేకించి ఏపీలోని ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. అంతేకాదు.. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల స్పీడ్‌తో ఈదురుగాలులు వీస్తాయని వారు పేర్కొన్నారు.

కాగా ఇప్పటికే తమిళనాడులోని ప్రజలు కరోనాతో పోరాడుతుంటే.. ఇప్పుడు ఈ ఎంఫాన్ తుఫాన్.. ప్రజలను మరింత ఇబ్బందుల్లోకి తోస్తుంది. అయితే ఈ తుఫాన్‌తో కరోనా మరింత ప్రబలే ఛాన్స్ ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముందుగానే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Read More:

రూ.20 లక్షల కోట్లు.. ఏ రంగానికి ఎంతంటే?

భార్య స్పైసీ వంట చెయ్యలేదని బాల్కనీ నుంచి దూకబోయిన భర్త..

గుడ్‌న్యూస్.. వారికి 3 నెలలు గ్యాస్ సిలిండర్ ఉచితం