AAP: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై :ఆప్” కీలక ప్రకటన.. అన్ని స్థానాల నుంచి బరిలోకి సై

|

Jun 05, 2022 | 6:23 AM

పంజాబ్(Punjab) అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆప్.. ఇప్పుడు గుజరాత్(Gujarat) అసెంబ్లీ ఎన్నికలపై గురి పెట్టింది. ఎలాగైనా గుజరాత్ లో పాగా వేయాలనే లక్ష్యంతో వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలోని...

AAP: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై :ఆప్ కీలక ప్రకటన.. అన్ని స్థానాల నుంచి బరిలోకి సై
Aap
Follow us on

పంజాబ్(Punjab) అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆప్.. ఇప్పుడు గుజరాత్(Gujarat) అసెంబ్లీ ఎన్నికలపై గురి పెట్టింది. ఎలాగైనా గుజరాత్ లో పాగా వేయాలనే లక్ష్యంతో వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నట్లు ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రకటించింది. మొత్తం 182 స్థానాల నుంచి పోటీ చేయనున్నట్లు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి, ఆప్‌ సీనియర్‌ నేత మనీశ్‌ సిసోడియా వెల్లడించారు. రాష్ట్ర ప్రజలకు ఇప్పటివరకు ప్రత్యామ్నాయం లేకుండా పోయిందని, ఇప్పుడు ‘ఆప్‌’ వస్తోందని అన్నారు. ఎవరికి ఓటు వేయాలో ఇక ప్రజలే నిర్ణయించుకోవాలని సూచించారు. గుజరాత్ రాష్ట్రంపైనే కాకుండా హిమాచల్‌ ప్రదేశ్‌(Himachal Pradesh) అసెంబ్లీ ఎన్నికలపైనా దృష్టి సారించింది. కొద్దిరోజుల క్రితమే హిమాచల్‌లో ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ భారీ ర్యాలీ నిర్వహించారు. గతంలో గుజరాత్‌లో పర్యటించిన కేజ్రీవాల్‌ ఆప్‌ను గెలిపిస్తే రాష్ట్రంలో అవినీతి లేకుండా చేస్తానని వెల్లడించారు.

గుజరాత్​అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ కు గట్టి షాక్ తగిలింది. పాటిదార్​ఉద్యమ నేత హార్దిక్​ పటేల్​బీజేపీలో చేరారు. పార్టీ గుజరాత్ చీఫ్ సీఆర్​ పాటిల్​సమక్షంలో గాంధీనగర్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం కాషాయ కండువా కప్పుకున్నారు. అంతకుముందు కమలం పార్టీలో తన చేరికపై ట్విట్టర్​ వేదికగా స్పందించిన హార్దిక్ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఒక చిన్న సైనికుడిగా సేవ చేయాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి