వరుస విమాన ప్రమాదాలతో అల్లకల్లోలం.. ఒకేరోజు కుప్పకూలిన సుఖోయ్, మిరాజ్, ఫైటర్‌ జెట్‌..

|

Jan 28, 2023 | 12:06 PM

రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లలో రక్షణశాకకు చెందిన రెండు యుద్ధ విమానాలు కుప్పకూలడం కలకలం రేపింది. మధ్యప్రదేశ్‌లోని మొరెనా సమీపంలో సుఖోయ్-30, మిరాజ్ 2000 విమానాలు

వరుస విమాన ప్రమాదాలతో అల్లకల్లోలం.. ఒకేరోజు కుప్పకూలిన సుఖోయ్, మిరాజ్, ఫైటర్‌ జెట్‌..
Sukhoi Plane
Follow us on

రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లలో రక్షణశాఖకు చెందిన రెండు యుద్ధ విమానాలు, ఓ ఫైటర్ జెట్ కుప్పకూలడం కలకలం రేపింది. మధ్యప్రదేశ్‌లోని మొరెనా సమీపంలో సుఖోయ్-30, మిరాజ్ 2000 విమానాలు కూలిపోయాయని అధికార వర్గాలు తెలిపాయి. దీంతోపాటు రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పింగోరా రైల్వే స్టేషన్ సమీపంలో ఎయిర్ ఫోర్స్ విమానం కూలిపోయింది. ఈ రెండు ఘటనలకు సంబంధించి సమాచారం అందుకున్న ఇరు రాష్ట్రాల అధికార యంత్రాంగాలు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.

గ్వాలియర్‌ ఎయిర్‌బేస్‌ నుంచి యుద్ధ విమానాల విన్యాసాలు జరుగుతుండగా.. మొరెనా సమీపంలో సుఖోయ్‌-30, మిరాజ్‌ విమానాలు ఒకదానికొకటి ఢీకొని కుప్పకూలాయి. శిక్షణ సమయంలో ఇవి ఢీకొన్నట్లు పేర్కొంటున్నారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ఎయిర్ బేస్ నుంచి రెండు విమానాలు వ్యాయామాలు చేస్తుండగా ఈ ఘటన జరిగింది.

ఇవి కూడా చదవండి

ఈ సంఘటనలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..