Okkadu Sequel: ‘ఒక్కడు’ మళ్లీ రానున్నాడా..? క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. దర్శకుడు అతనే అంటూ..
Mahesh Okkadu Sequel: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కెరీర్లో 'ఒక్కడు' చిత్రానికి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటి వరకు ఎక్కువగా...
Mahesh Okkadu Sequel: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కెరీర్లో ‘ఒక్కడు’ చిత్రానికి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటి వరకు ఎక్కువగా సాఫ్ట్ మూవీస్ చేస్తూ వస్తోన్న మహేష్.. ఈ చిత్రంతో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. 2003లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఓ సంచలనం. ఏకంగా ఎనిమిది విభాగాల్లో నంది అవార్డులను సొంతం చేసుకొని బాక్సాఫీస్ హిట్గా నిలిచింది. ఇదిలా ఉంటే గతకొన్ని రోజులుగా ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కనుందని ఓ వార్త తెగ హల్చల్ చేస్తోంది. ఒక్కడు చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన ఎమ్.ఎస్ రాజు ఇటీవల ‘డర్టీ హరి’ చిత్రానికి దర్శకత్వం వహించి భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక చిత్రం సూపర్ హిట్ అయిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాజును.. ‘ఒక్కడు’ సీక్వెల్పై వస్తోన్న వార్తల గురించి అడగ్గా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఒక్కడు’ సీక్వెల్ కచ్చితంగా ఉంటుందని.. కథ కుదిరితే వెంటనే సీక్వెల్ చేస్తానని తెలిపాడు. ఒకవేళ ఈ సినిమా ఓకే అయితే దీనికి కూడా గుణశేఖర్ దర్శకత్వం వహిస్తాడని క్లారిటీ ఇచ్చాడు. వచ్చే నెలలో ఈ సినిమాపై ప్రకటన కూడా చేస్తానని తేల్చి చెప్పాడు. దీంతో ప్రిన్స్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ‘ఒక్కడు’ చిత్రానికి గుణశేఖర్ కథ అందించడంతో పాటు, దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
Also Read: Corona Effect: కరోనా తర్వాత వాటిపై ఎక్కువ ఖర్చు పెడుతున్నారట.. అధ్యాయనాల్లో బయటపడ్డ కీలక విషయాలు..