Telangana coronavirus: తెలంగాణలో కొనసాగుతున్న కరోనా వైరస్.. కొత్తగా 224 మందికి పాజిటివ్
తెలంగాణలో కొత్తగా 224 మందికి కరోనా వైరస్ సోకినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడంలేదు. శనివారం రాత్రి 8గంటల నుండి ఆదివారం రాత్రి 8గంటల వరకు 224 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కాగా, గడిచిన 24 గంటల వ్యవధిలో 24,785 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 224 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 2,90,008కి చేరింది. మరోవైపు కరోనాతో ఇవాళ మరోకరు ప్రాణాలను కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా కరోనా బారినపడి చనిపోయినవారి సంఖ్య 1,566కి పెరిగింది.
కాగా, ఇవాళ 461 మంది కరోనా వైరస్ను జయించగా.. ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 2,83,924గా చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,518 కొవిడ్ క్రియాశీల కేసులు ఉండగా.. వీరిలో 2,439 మంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్లు అధికారులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొన్నారు. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో 56 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.