GHMC Elections Results 2020 : కొనసాగుతున్న కౌంటింగ్.. ఐ.స్ సదన్ డివిజన్, గౌలిపురాలో బీజేపీ విజయం..

|

Dec 04, 2020 | 8:40 PM

జీహెచ్‌ఎంసీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఒక్కో డివిజన్ ఫలితాలు వెంట వెంటనే వెలువడుతున్నాయి.

GHMC Elections Results 2020 : కొనసాగుతున్న కౌంటింగ్.. ఐ.స్ సదన్ డివిజన్, గౌలిపురాలో బీజేపీ విజయం..
Follow us on

జీహెచ్‌ఎంసీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఒక్కో డివిజన్ ఫలితాలు వెంట వెంటనే వెలువడుతున్నాయి. పోటీ చేసిన అభ్యర్థుల్లో టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. ఈ ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్ అత్యధిక స్థానాలు గెలుచుకొని ముందంజలో ఉంది. కాగా కారు జోరుకు ఏమాత్రం తగ్గకుండా బీజేపీ, ఎంఐఎం పోటీ ఇస్తున్నాయి. పలు డివిజన్‌లో ఎవరూ ఊహించని విధంగా ఫలితాలు వస్తున్నాయి. తాజాగా ఐ.స్ సదన్ డివిజన్‌లో తెరాస అభ్యర్థి సామ స్వప్న సుందర్ రెడ్డిపై బీజేపీ అభ్యర్థి శ్వేతా మధుకర్ రెడ్డి 2402 ఓట్ల మెజారిటీ తో విజయం సాధించారు. అలాగే గౌలి పురాలో తెరాస అభ్యర్థి బొద్దు సరితపై బీజేపీ అభ్యర్థి అలె భాగ్యలక్ష్మి 10857ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇప్పటివరకు టీఆర్ఎస్ 54 స్థానాల్లో గెలుపొందగా, బీజేపీ 45, ఎంఐఎం 42, కాంగ్రెస్ 2 స్థానాలను కైవసం చేసుకున్నాయి.

GHMC Elections Results 2020 : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దూసుకెళుతున్న కారు.. ఖైరతాబాద్, సనత్‌నగర్‌ డివిజన్లో గులాబీ జెండా రెపరెపలు..