GHMC Elections Results 2020 : ఫలక్నుమా డివిజన్ లో ఆరు స్థానాల్లో విజయం సాధించిన ఎంఐఎం
గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ 65 , బీజేపీ 32 , ఎంఐఎం 34స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తున్నాయి. ఫలక్ నామ డివిజన్ లో ఆరు స్థానాల్లో ఎంఐఎం విజయం సాధించింది.
గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ 65 , బీజేపీ 32 , ఎంఐఎం 34స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తున్నాయి. ఫలక్ నామ డివిజన్ లో ఆరు స్థానాల్లో ఎంఐఎం విజయం సాధించింది. నవాబ్ సాహెబ్ కుంటాలో ఎంఐఎం అభ్యర్థి షరీన్ ఖాతున్ గెలుపొందారు. ఫలక్ నామలో ఎంఐఎం అభ్యర్థి తారా భాయ్ సమీప ప్రత్యర్థి పై విజయం సాధించారు. రాంనాస్థపురా లో ఎంఐఎం అభ్యర్థి మహ్మద్ ఖాదర్ గెలుపొందారు. ధూద్ బౌలీలో ఎంఐఎం అభ్యర్థి మహ్మద్ సలీం విజయం సొంతం చేసుకున్నారు. అదేవిధంగా కిషన్ బాగ్ లో ఎంఐఎం అభ్యర్థిగా బరిలో దిగిన ఖాజా ముషఫరుద్దీన్ గెలుపొందారు. జహానుమ కూడా ఎంఐఎం తన ఖాతాలో వేసుకుంది. ఎంఐఎం అభ్యర్థి మహ్మద్ అబ్దుల్ సమీప ప్రత్యర్థి పై విజయం సాధించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రభస.. ఐదవ రోజూ కొనసాగిన సస్పెన్షన్ల పర్వం.. 10 మంది టీడీపీ సభ్యులపై వేటు..