ధోని అభిమానులకు మరో బ్యాడ్ న్యూస్…

|

Aug 17, 2020 | 12:58 AM

అంతర్జాతీయ క్రికెట్‌కు మహేంద్రసింగ్ ధోని రిటైర్మెంట్ ప్రకటించడంతో అభిమానులందరూ తీవ్ర నిరాశ చెందారు. తమ అభిమాన ఆటగాడిని ఇక మీదట బ్లూ జెర్సీలో చూడలేమనే ఊహ వారిని బాధపెడుతోంది.

ధోని అభిమానులకు మరో బ్యాడ్ న్యూస్...
Follow us on

No Farewell Match For Dhoni: అంతర్జాతీయ క్రికెట్‌కు మహేంద్రసింగ్ ధోని రిటైర్మెంట్ ప్రకటించడంతో అభిమానులందరూ తీవ్ర నిరాశ చెందారు. తమ అభిమాన ఆటగాడిని ఇక మీదట బ్లూ జెర్సీలో చూడలేమనే ఊహ వారిని బాధపెడుతోంది. ఈ క్రమంలో ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ బీసీసీఐకు ఓ విజ్ఞప్తి చేశారు. ”ధోని రిటైర్మెంట్‌పై అభిమానులు సంతృప్తిగా లేరని.. వీడ్కోలు మ్యాచ్ నిర్వహించాలని కోరారు. మహీ కోసం ఫేరెవెల్ మ్యాచ్ నిర్వహిస్తే ఝార్ఖండ్ ఆతిధ్యమిస్తుందని” హేమంత్ సోరెన్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. దీనిపై తాజాగా ఐపీఎల్ మాజీ చైర్మన్ రాజీవ్ శుక్లా స్పందించారు.

ధోని కోసం ఫేరెవెల్ మ్యాచ్ నిర్వహించడం కుదరదని ఆయన స్పష్టం చేశారు. బీసీసీఐ వద్ద ధోని ఎప్పుడూ కూడా అలాంటి ప్రతిపాదనను తీసుకురాలేదని.. ఆయన కోరనప్పుడు వీడ్కోలు మ్యాచ్ అనేది ఉండబోదని రాజీవ్ శుక్లా తెలిపారు. కాగా, స్వాతంత్ర్య దినోత్సవం నాడు ధోని.. ఆ వెంటనే సురేష్ రైనా ఇద్దరూ కూడా తమ రిటైర్మెంట్లను ప్రకటించారు.

Also Read:

‘రనౌట్’తో కెరీర్ ప్రారంభం.. అదే రిటైర్మెంట్‌కు కారణం..!

అంతర్జాతీయ క్రికెట్‌కు సురేష్ రైనా గుడ్ బై..

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించిన ధోని..

వరుసగా నాలుగు వికెట్లు.. చరిత్ర సృష్టించిన మహిళా క్రికెటర్..

భారత యువత టార్గెట్‌గా చైనా కుట్ర.. చేధించిన హైదరాబాద్ పోలీసులు..

గ్యాస్ బుక్ చేసుకుంటున్నారా.! అయితే మీకో అదిరిపోయే ఆఫర్..