‘టీడీపీ’ మునిగిపోతున్న నావ : మాణిక్యాల రావు

టీడీపీ నేతలంతా బీజేపీ వైపే చూస్తున్నారని, మాజీలు.. మాత్రమే కాదు సిట్టింగులు కూడా బీజేపీలో చేరతారని అంటున్నారు మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు. అంతేకాకుండా ‘టీడీపీ మునిగిపోతున్న నావ’ అని వ్యాఖ్యానించారు. పరిపాలనా దక్షత లేక కేవలం కేంద్రంపై అపోహలను కలిగించి.. రాష్ట్రంలో లబ్ధిపొందాలని చూసిన టీడీపీకి ప్రజలు సరైన శాస్తి చేశారని అన్నారు. టీడీపీకి భవిష్యత్తు లేదని ఆలోచించిన నేతలంతా బీజేపీలో చేరడానికి సుముఖంగా ఉన్నారని పేర్కొన్నారు. చీకటి నుంచి వెలుగులోకి రావడానికి ఎలా ప్రయాణం […]

'టీడీపీ' మునిగిపోతున్న నావ : మాణిక్యాల రావు
Follow us

| Edited By:

Updated on: Jun 22, 2019 | 12:57 PM

టీడీపీ నేతలంతా బీజేపీ వైపే చూస్తున్నారని, మాజీలు.. మాత్రమే కాదు సిట్టింగులు కూడా బీజేపీలో చేరతారని అంటున్నారు మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు. అంతేకాకుండా ‘టీడీపీ మునిగిపోతున్న నావ’ అని వ్యాఖ్యానించారు. పరిపాలనా దక్షత లేక కేవలం కేంద్రంపై అపోహలను కలిగించి.. రాష్ట్రంలో లబ్ధిపొందాలని చూసిన టీడీపీకి ప్రజలు సరైన శాస్తి చేశారని అన్నారు. టీడీపీకి భవిష్యత్తు లేదని ఆలోచించిన నేతలంతా బీజేపీలో చేరడానికి సుముఖంగా ఉన్నారని పేర్కొన్నారు. చీకటి నుంచి వెలుగులోకి రావడానికి ఎలా ప్రయాణం జరుగుతుందో.. ఆ దిశగానే టీడీపీ నేతలంతా బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. తెలుగు దేశం పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తోందని ఆరోపించారు. ఏపీలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ‘బీజేపీ’ అవతరిస్తుందని అన్నారు. అయితే.. ఖచ్చితంగా మాజీ శాసన సభ్యులే కాకుండా.. శాసనసభ్యులే.. బీజేపీలోకి రావడం ఖాయమని తెలిపారు పైడికొండల మాణిక్యాల రావు.