కాకినాడలో హైటెన్షన్.. ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించి!

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో హైటెన్షన్ నెలకొంది. వైసీపీ, జనసేన వర్గాల రాళ్ల దాడితో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆయన ఇంటిని ముట్టడించేందుకు జనసేన కార్యకర్తలు యత్నించారు. దీంతో జనసేన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. కాగా.. జనసేన, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరు వర్గాలు పరస్పరం రాళ్ల దాడికి దిగారు. ఈ ఘర్షణలో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

కాకినాడలో హైటెన్షన్.. ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించి!
Follow us

| Edited By:

Updated on: Jan 12, 2020 | 4:31 PM

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో హైటెన్షన్ నెలకొంది. వైసీపీ, జనసేన వర్గాల రాళ్ల దాడితో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆయన ఇంటిని ముట్టడించేందుకు జనసేన కార్యకర్తలు యత్నించారు. దీంతో జనసేన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. కాగా.. జనసేన, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరు వర్గాలు పరస్పరం రాళ్ల దాడికి దిగారు. ఈ ఘర్షణలో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.