COVID 19: కరోనా వైరస్ దేశంలో చాప కింద నీరులా వేగంగా విస్తరిస్తున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసిన ప్రభుత్వం.. ఆ గడువును ఏప్రిల్ 14 వరకు పొడిగించింది. దేశంలో లాక్ డౌన్ ప్రకటించిన తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటికే 695 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అంతేకాకుండా ఈ వ్యాధి కారణంగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్ 19ను కట్టడి చేసేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాయి.
For More News:
దేశంలో మొట్టమొదటి కోవిడ్ 19 ఆసుపత్రి.. రిలయన్స్ సంచలనం..
గుడ్ న్యూస్.. కరోనాలా హంటా వైరస్ కాదట… అసలు నిజమిదే.!
కరోనా ఎఫెక్ట్.. దేశవ్యాప్తంగా టోల్ గేట్ ఫీజులు రద్దు..
కూరగాయలు, నిత్యావసర వస్తువుల రేట్లు ఫిక్స్.. ధరలు పెంచితే కేసులు తప్పవు..
సామాజిక దూరం పాటిస్తే.. ఇండియాలో కరోనా కేసులు 62 శాతం తగ్గుతాయట..!