కూరగాయలు, నిత్యావసర వస్తువుల రేట్లు ఫిక్స్.. ధరలు పెంచితే కేసులు తప్పవు..
Coronavirus Effect: కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మూడు వారాల పాటు లాక్ డౌన్ ప్రకటించింది. అత్యవసర సేవలు తప్పితే అన్నీ కూడా బంద్ కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఈ సమయాన్ని క్యాష్ చేసుకుంటూ కొంతమంది వ్యాపారులు నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలను పెంచి అమ్ముతున్నారు. దీనితో తెలంగాణ ప్రభుత్వం వాటి ధరలను నిర్ణయించింది. ఒకవేళ ఎవరైనా కూడా ఆ ధరల కంటే అధికంగా అమ్మితే పీడి యాక్ట్ కింద […]
Coronavirus Effect: కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మూడు వారాల పాటు లాక్ డౌన్ ప్రకటించింది. అత్యవసర సేవలు తప్పితే అన్నీ కూడా బంద్ కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఈ సమయాన్ని క్యాష్ చేసుకుంటూ కొంతమంది వ్యాపారులు నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలను పెంచి అమ్ముతున్నారు. దీనితో తెలంగాణ ప్రభుత్వం వాటి ధరలను నిర్ణయించింది. ఒకవేళ ఎవరైనా కూడా ఆ ధరల కంటే అధికంగా అమ్మితే పీడి యాక్ట్ కింద కేసులు పెట్టనుంది.
కూరగాయలు…
- వంకాయ- రూ.30 కేజీ
- బెండకాయ- రూ.40 కేజీ
- టమాట- రూ.10 కేజీ
- అరటికాయ- రూ.40 కేజీ
- కాలిఫ్లవర్- రూ.40 కేజీ
- క్యాబేజి- రూ.23 కేజీ
- పచ్చిమిర్చి- రూ.60 కేజీ
- చిక్కుడుకాయ- రూ.45 కేజీ
- బీరకాయ- రూ.60 కేజీ
- క్యారెట్- రూ.60 కేజీ
- ఆలుగడ్డ- రూ.30 కేజీ
- ఉల్లిపాయలు(తెల్లవి)- రూ.30 కేజీ
- ఉల్లి(ఎర్రవి)- రూ.35 కేజీ
- వెల్లుల్లి- రూ.160 కేజీ
- అల్లం- రూ.220 కేజీ
ఆకు కూరల రేట్లు ఇలా ఉన్నాయి..
- పాలకూర- కిలో రూ.40
- తోటకూర- కిలో రూ.40
- కొత్తిమీర- కిలో రూ.60
- మెంతికూర- కిలో రూ.60
నిత్యావసర వస్తువుల రేట్లు..
- కందిపప్పు(గ్రేడ్1)- కిలో రూ.95
- మినపపప్పు- కిలో రూ.140
- పెసరపప్పు- కిలో రూ.105
- శెనగపప్పు- కిలో రూ.65
- సజ్జలు- కిలో రూ.30
- గోధుమలు- కిలో రూ.36,
- జొన్నలు- కిలో రూ.38
- రాగులు- కిలో రూ.40
For More News:
ఇండియా లాక్ డౌన్.. ఏ సేవలకు బ్రేక్.? ఏవి ఉంటాయి.?
‘ఇంటికి రావద్దు ప్లీజ్’.. కరోనా అనుమానితుల ఇళ్లకు రెడ్ నోటిసులు..
దేశంలో మొట్టమొదటి కోవిడ్ 19 ఆసుపత్రి.. రిలయన్స్ సంచలనం..