ఏపీలో కరోనా తగ్గుముఖం.. 6 లక్షలు దాటిన రికవరీలు..

|

Sep 27, 2020 | 6:43 PM

Coronavirus In Andhra Pradesh: ఏపీలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,923 పాజిటివ్ కేసులు, 45 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 6,72,779కి చేరింది. వీటిల్లో 64,876 యాక్టివ్ కేసులు ఉండగా.. 6,05,090 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 5708కి చేరుకుంది. అటు గడిచిన 24 గంటల్లో 7,796 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. నిన్న ఒక్క […]

ఏపీలో కరోనా తగ్గుముఖం.. 6 లక్షలు దాటిన రికవరీలు..
Follow us on

Coronavirus In Andhra Pradesh: ఏపీలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,923 పాజిటివ్ కేసులు, 45 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 6,72,779కి చేరింది. వీటిల్లో 64,876 యాక్టివ్ కేసులు ఉండగా.. 6,05,090 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 5708కి చేరుకుంది.

అటు గడిచిన 24 గంటల్లో 7,796 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. నిన్న ఒక్క రోజే తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1006 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత పశ్చిమగోదావరి 929 కేసులు నమోదయ్యాయి. ఇక అనంతపురం 480, చిత్తూర్ 577, గుంటూరు 535, కడప 472, కృష్ణ 333, కర్నూలు 229, నెల్లూరు 506, శ్రీకాకుళం 503, విజయనగరం 376, ప్రకాశంలో 659, విశాఖపట్నం 318 కేసులు నమోదయ్యాయి. కాగా, తూర్పుగోదావరిలో అత్యధికంగా 94,190 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. చిత్తూరులో 635 కరోనా మరణాలు సంభవించాయి.

Also Read:

మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలు.!

బ్రూసెల్లోసిస్‌… తస్మాత్ జాగ్రత్త.!

ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ.. ఆ ప్రదేశాల్లో లిక్కర్ షాపులకు నో పర్మిషన్..

కరోనాపై ఎస్పీ బాలు చివరి పాట.. ఎంత మధురంగా పాడారంటే.!

సెప్టెంబర్ 25.. టాలీవుడ్ ఇండస్ట్రీకి బ్లాక్ డే..